గ్లామర్ ఉంటే సరిపోతుందా..?

NAGARJUNA NAKKA
పోటీలో ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎవరున్నారన్నదే సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. అలాగే ఇండస్ట్రీలో ఎంతమంది  హీరోయిన్లు ఉన్నారనేదానికంటే, పాత్రకి న్యాయం చేసేవాళ్లు ఎంతమంది ఉన్నారనేదే ముఖ్యం. అయితే టాలీవుడ్ లో కోట్లు తీసుకునే హీరోయిన్లు చాలామంది ఉన్నా.. సినిమా అవసరాన్ని  తీర్చే వాళ్లు లేరని కామెంట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కోట్ చేస్తున్న హీరోయిన్ పూజాహెగ్డే. ‘అరవింద సమేత, అల వైకుంఠపురం’హిట్స్ తో ఒక్కో సినిమాకి 2 కోట్ల వరకు కోట్ చేస్తోంది. అయితే ఇంత భారీగా వసూల్ చేస్తోన్న పూజ, ఈ ఫిగర్ కి మాత్రం న్యాయం చేయలేకపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  పూజా ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా పెర్ఫామర్ గా ప్రూవ్ చేసుకోలేదని, కేవలం గ్లామర్ డాల్ గానే మిగిలిపోయిందని విమర్శలొస్తున్నాయి. అందుకే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కి పూజాని ఫస్ట్ ఆప్షన్ గా చూడలేకపోతున్నారట దర్శకనిర్మాతలు.
మీకు అర్థమవుతోందా.. అంటూ స్టార్ రేసులోకి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన. ‘సరిలేరు నీకెవ్వరు’సక్సెస్ తో స్టార్ రేసులోనూ అడుగుపెట్టింది రష్మిక.  ఈ హిట్ తోనే అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోనూ ఆఫర్ అందుకుంది. అయితే సూపర్ స్టార్డమ్ వచ్చినా ఈమెలో అంత వర్త్ లేదనే విమర్శలు మాత్రం తగ్గట్లేదు. రష్మిక నాలుగు ఎక్స్ ప్రెషన్స్ తోనే నెట్టుకొస్తుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
'మహానటి'తో నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తీ సురేష్. బరువైన పాత్రలని కూడా అవలీలగా చేయగలదని అవార్డుతో సహా నిరూపించింది. కానీ కీర్తీ ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్సే చేసింది. దీంతో కీర్తీ గ్లామర్ రోల్స్ కి సెట్ అవ్వదనే ఒపీనియన్ లో ఉన్నారు దర్శకులు. అయితే ఇప్పుడు మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తీ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. మరి ఈ సినిమాతో కీర్తీ గ్లామర్ రోల్స్ కూడా చేయగలనని ప్రూవ్ చేసుకుంటుందా అనేది చూడాలి.
లుక్స్, పెర్ఫామెన్స్ లో ఓకే అనిపించుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ఈమె చిన్న సినిమాల్లో మెరుపులు మెరిపిస్తున్నా, టాప్ హీరోల సినిమాలకి మాత్రం బెస్ట్ ఆప్షన్ గా కనిపించడం లేదు. టాప్ లీగ్ హీరోల్లో ఒక్క జూ.ఎన్టీఆర్ తో మాత్రమే కలిసి నటించింది రాశి. ‘జైలవకుశ’తర్వాత మళ్లీ పెద్ద హీరోలతో కలిసి పనిచేయలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: