విక్టరీ వెంకటేష్ ప్లేస్ ని భర్తీ చేసిన హీరో శర్వానంద్....అసలు ఏం జరిగింది ?

Lokesh

హీరో వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలతో కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా దూరుకుపోతున్నారు. ఎఫ్.2 సినిమాతో మళ్ళీ పాత వెంకటేష్ ని గుర్తు చేశాడు వెంకీ. గతేడాది సంక్రాంతి టైమ్ లో  వచ్చిన ఎఫ్.2 కుటుంబ ప్రేక్షకుల ను ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన వెంకీ మామ సినిమా కాస్త నిరాశపరిచిందనే అంటారు. అయితే వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా  సినిమా షూటింగ్ లో ఉన్నాడు. తమిళ హిట్ మూవీ ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘నారప్ప’ ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉంది.  తమిళం లో ధనుష్ పోషించిన పాత్రలో తెలుగులో వెంకటేష్ నటిస్తున్నారు.

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లకు మంచి ఆదరణ లభించింది. వెంకటేష్ ను కొత్తలుక్ లో చూసిన అభిమానులు నారప్ప క్యారెక్టర్ లో వెంకీ ని ఊహించుకొని మురిసిపోతున్నారు.  అయితే వెంకీ తరువాత ఎం సినిమాలు చేయబోతున్నాడు అనే దానిపై ఇండస్ట్రీ లో చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెంకీ నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల తో ఓ సినిమా చేస్తున్నట్టు కొన్ని నెలల క్రితమే వార్తలు వినిపించాయి.

 

ఆ సినిమాకు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే టైటిల్ కూడా పెట్టినట్టు సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు రద్దయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో వెంకటేష్ కి దర్శకుడు సుకుమార్ కి క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని, అందుకే ఈ సినిమా కు చేసుకున్న ఒప్పందాలు రద్దయ్యాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినబడుతోంది.  అయితే వెంకటేష్ స్థానం  లో యువ హీరో శర్వానంద్ ను తీసుకోనున్నట్లు సమాచారం. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: