వ‌రుణ్‌తో క‌లిసి కియారా బాక్సింగ్‌

Arshu
ఫగ్లీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. తన సెకండ్ సినిమా ఎంఎస్ ధోనితో ఫేమస్ అయ్యింది.  అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ వచ్చింది.  ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వచ్చాయి. 


బాలీవుడ్ అందాల తారగా ప్రస్తుతం కియారా అద్వాని ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే,  'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.  హిందీలో కబీర్ సింగ్ సినిమాతో మరో స్థాయికి వెళ్ళింది.  అవసరానికి మించి ముద్దుల వర్షం కురిపించడంతో భారీ హిట్ అయ్యింది. అలాంటి కియారా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.


వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ ఒక సినిమాను నిర్మించనున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం కియారాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.
కియారా అసలు పేరు అలియా అద్వాని.  ఆల్రెడీ ఇండస్ట్రీలో అలియా భట్ ఉండటంతో తన పేరు ముందు కియారా చేర్చుకుంది.  కియారా అలియా అద్వాని అయినా అందరు కియారా అని పిలవడంతో అదే పేరుతో ఫేమస్ అయ్యింది.  ఈ పేరు వెనుక కూడా ఓ కారణం ఉన్నది.  2010 లో వచ్చిన అంజనా అంజాని సినిమాలో ప్రియాంక చోప్రా పేరు కియారా.  ఆ పేరును తన పేరుగా పెట్టుకోవడంతో కలిసి వచ్చిందని అంటోంది కబీర్ సింగ్ భామ.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: