తెలుగు లస్ట్ స్టోరీస్ పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్..ఫ్యాన్స్ బీ రెడీ..!

Kunchala Govind
బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కంప్లీట్ అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు ఓవరాల్ గా ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ తోనే కియారా అద్వాని భయంకరమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా ఇదే 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సందీప్ రెడ్డి వంగా-తరుణ్ భాస్కర్-సంకల్ప్ రెడ్డి తదితరులతో కలిసి నందిని రెడ్డి ఈ లస్ట్ స్టోరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగులోనూ రీమేక్ చేస్తోందని ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని దర్శకురాలు నందిని రెడ్డి కుండ బద్దలు కొట్టారు.

అసలు ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని నందిని రెడ్డి ఇదివరకే ఒకసారి ఖండించిన సంగతి తెలిసందే. నెట్ ఫ్లిక్స్ ఎందుకు లస్ట్ స్టోరీస్ ని తెలుగులో తీస్తుంది? ఆల్రెడీ సబ్ టైటిల్స్ తో వచ్చేసిన దాన్ని తిరిగి రీమేక్ ఎందుకు చేస్తారు? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు నందిని రెడ్డి. లస్ట్ స్టోరీస్ ని తెలుగులో తీయడం లేదు. హిందీలో కనిపించిన ఏ స్టోరీ తెలుగు వెబ్ సిరీస్ లో కనిపించదు. మేం చేసేది డిఫరెంట్ స్టోరీస్. అవి లస్ట్ స్టోరీస్ కాదు.. అంటూ మరోసారి నందిని రెడ్డి క్లియర్ గా క్లారిటి ఇచ్చారు. 

ఇటీవలే అమలాపాల్ తో నందిని రెడ్డి పార్ట్ కంప్లీటయిందని సమాచారం. నందిని తీస్తున్న వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న మాట వాస్తవమే. కానీ అది లస్ట్ స్టోరీస్ మాత్రం ఏమాత్రం కాదని నందిని మాటల్ని బట్టి అర్థమవుతోంది. నందిని రెడ్డి సహా ఇతర యువదర్శకులు ఒక్కొక్కరూ ఒక్కో కొత్త కథతో సినిమా తీస్తున్నారు. వాటన్నిటికీ ఒకదానితో ఒకటిగా అర్థవంతమైన కనెక్టివిటీ ఉంటుందని అర్థమవుతోంది. లస్ట్ స్టోరీస్ తరహాలోనే ఇదో డిఫరెంట్ కథలతో చేస్తున్న నిక్ ప్రయత్నమని నందిని రెడ్డి ఇచ్చిన క్లారిటిని బట్టి తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: