ముప్పయి...వెరీ హాట్ గురూ...!!

Satya
సినిమా రంగంలో వయసు చాలా కీలకం. పరువాల పదహారు వెండి తెరకు జలతారు అద్దుతుంది. అందం పందెం వేసుకుని పరుగులు తీస్తుంది. సొగసుల గని తానేనని కూడా నిబ్బరం పోతుంది. సెగలు పుట్టించే సోకుతో కేక పుట్టిస్తుంది. నిండు జాబిలిలా వెన్నెలకు కురిపిస్తూ మత్తెక్కిస్తుంది. మైమరపిస్తుంది. 


మరి హీరోలు ఎపుడూ ఇరవై, హీరోయిన్ పదహారు అంటే కుదరదు కదా. వయసు పాదరసంలా కరిగిపోతూంటుంది. మరి ఒక ఏజ్ వచ్చిన తరువాత హీరోయిన్లుగా ఉండడమూ కష్టమే. వారికి అవకాశాలు రావడమూ కష్టమే. ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది హీరోయిన్లు నాటౌట్ అంటున్నారు. హీరోల కంటే మేమేం తక్కువ అని కూడా సవాల్ చేస్తున్నారు. దశాబ్దాలు గడచినా ఇంకా స్టార్ ఇమేజ్ తో తళతళలాడుతున్నారు. 


నయనతార, కాజల్ అగర్వాల్, శ్రియ, త్రిష, అనుష్క  సిమ్రాన్ వంటి హీరోయిన్లు మేమింకా పదహారే అంటూ పడుచుతనం పండిచేస్తున్నారు. వారితో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు కూడా రెడీ అంటున్నారు. వీరిలో మొదట చెప్పుకోవాల్సింది  నయన్ గురించి. అమె ముప్పయి వయసు ఎపుడో దాటేసినా ఇంకా సూపర్ స్పీడ్ లో ఉంది. కోలీవుడ్ మహరాణీగా వెలిగిపోతోంది. అంతే కాదు. ఇటు టాలీవుడ్ లోనూ యమ డిమాండ్ సంపాదించుకుంది. ఆమెతో మూవీ అంటే చాలు మన హీరోలు ఎగబడుతున్నారంటే నయన్ అంటే ఏంటో చెబుతోంది.


అదే వరసలో అనుష్క కూడా ఉంది. ఆమెతో సైతం సినిమాలు చేయాడానికి హీరోలు రెడీ అంటున్నారు. ఇప్పటికే ఆమెతో సైరా చేసిన మెగాస్టార్ ఇపుడు కొరటాల శివతో చేసే మూవీకి కూడా హీరోయిన్ గా  బక్ చేస్తున్నారని టాక్. ఇక అనుష్క కూడా మంచి డిమాండ్ లో ఉంది. ఆమెతో చేసేందుకు ఎన్నో కధలతో నిర్మాతలు వెంటబడుతున్నారు. త్రిష పేటతో రజనీ పక్కన నటించి హిట్ కొట్టేసింది. అలాగే విజయ్ సేతుపతితో కలిసి త్రిష నటించిన ‘96’ సినిమాతో త్రిష ఫేట్ మారిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు.. త్రిషకు చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇందులో వయసుకు తగ్గ పాత్రలో నటించడం ద్వారా దర్శకులు, రచయితలు తన కోసం భిన్నమైన పాత్రలు రాయొచ్చన్న సంకేతాలిచ్చింది.ఆ రకమైన పాత్రలతో చాలామంది త్రిషను కలుస్తున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తొలిసారి త్రిష నటించిన ‘పేట’ కూడా హిట్టవడంతో త్రిష క్రేజ్ ఇంకా పెరిగింది. ఆమె చేతిలో ఇప్పుడు అర డజను దాకా సినిమాలున్నట్లు సమాచారం. ఒక దశలో సినిమా అవకాశాలు పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుంది త్రిష. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇంత ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఆశ్చర్యమే.


మరోవైపు ‘పేట’లో రజనీకి జోడీగా నటించిన మరో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్‌కు కూడా మళ్లీ క్రేజ్ కనిపిస్తోంది. దీనికి ముందే ‘సీమ రాజా’లో విలన్ పాత్రతో మెప్పించిన సిమ్రాన్.. రజనీ సినిమా అనగానే మళ్లీ గ్లామర్ మీద కూడా దృష్టిపెట్టింది. మళ్లీ సెక్సీగా కనిపించి అభిమానుల్ని అలరించింది. ‘పేట’లో సిమ్రాన్‌ను చూసి మెచ్చి.. మాధవన్ హీరోగా నటించబోయే కొత్త సినిమాలో ఆమెను కథానాయికగా ఎంచుకున్నారట. వీళ్లిద్దరూ గతంలో ‘అమృత’ అనే గొప్ప సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. 42 ఏళ్ల వయసులో మళ్లీ మాధవన్ సరసన సిమ్రాన్ జంటగా నటించబోతుండటం విశేషమే. 


అదే వరసలో కాజల్ కూడా గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది.  కాజల్ ఇపుడు కమల్ తో భారతీయుడు 2 నటిస్తోంది. తెలుగులో సీత మూవీని తేజా డైరెక్షన్లో చేస్తోంది. ఆమెకు టాలీవుడ్ లో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి వీరంతా ముప్పయిలు  ఎపుడో దాటేసినా కూడా క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. నిజంగా ఇది రికార్డే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: