సినిమా ప్రారంభోత్సవ వేడుకలో కేసిఆర్

Prasad
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ ఓ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా, శ్రీహరి కీలక పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, నల్లమలుపు బుజ్జి, రమేష్ పుప్పాల కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. తెరాస అధినేత కేసీఆర్, సాయికుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవరం అభిలాష్ నిర్మాత. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. నిర్మాతతో ఉన్న పరిచయం కారణంగానే కేసిఆర్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘బుల్లెట్, రాకెట్ తరహాలో ఈ చిత్రంలో కథానాయుడి తీరు వుంటుంది. తను ప్రేమించిన యువతి కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు. మాస్ అంశాలకు ప్రాధాన్యమున్న ఓ మంచి కథ ఇదని’ చెప్పారు. ఫోటోగ్రఫీ : సెంథిల్ కుమార్, సంగీతం : మణిశర్మ అందిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్ రెడ్డి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : మరుధూరి రాజా, పాటలు : భాస్కరభట్ల, చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మరుధూరి వినోద్.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: