మనీ: ఈ పంటతో రైతులకు బోలెడు లాభాలు..!
ఈ నల్ల బియ్యం పంట నాలుగు నెలలు మాత్రమే.. వరి నారు పోసినప్పటి నుంచి పంట చేతికి రావడానికి సుమారుగా 100 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. సాధారణ వరి మొక్కల కంటే నల్ల వరి మొక్కలు కొంచెం పొడవు గా ఉంటాయి. అంతేకాదు వీటి కంకులు కూడా కొంచెం పెద్దగా వుంటాయి. ఇకపోతే సాధారణ బియ్యం ధర కిలో 50 రూపాయలు ఉంటే నల్లబియ్యం ధర 250 రూపాయలు ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్న నేపథ్యంలో నల్ల బియ్యం ధర కూడా భారీగా పెరుగుతోంది. కాబట్టి మీరు ఈ నల్ల బియ్యం సాగు చేసినట్లయితే మీకు మంచి ఆదాయంతో పాటు అంతకుమించిన ప్రయోజనాలను ఇతరులకు పంచిన వారవుతారు.
ముఖ్యంగా నల్లబియ్యం ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ , హృదయ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయని ఇప్పటికే పలు అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. 10 గ్రాముల నల్లబియ్యం నుంచి తొమ్మిది గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ బియ్యం తో రైతులు మంచి లాభాన్ని పొందుతారు.మీరు కూడా ఈ వ్యాపారంతో మంచి ఆదాయం పొందవచ్చు.