లైఫ్ స్టైల్: పసుపు అధికంగా వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ..!
నిజానికి పసుపు లో యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. అంతేకాదు మధుమేహం, ఒత్తిడి, అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా దూరం చేసే శక్తి పసుపుకి ఉంది. కానీ మోతాదుకు మించి తీసుకుంటే కలిగే అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా పసుపులో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది. అంతేకాదు దీనిని తినే ముందు పరిమాణం గురించి కూడా తెలుసుకోవాలి.
ఇక పసుపుని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ లోపం కూడా ఏర్పడుతుంది. దీని ఫలితంగా బలహీనత తో పాటు ఇతర సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక డయేరియా వంటి సమస్యలకు కూడా పసుపు కారణం అవుతుంది.ఇందులో ఉండే కర్కుమిన్ పొట్టలోని గ్యాస్ట్రిక్ డక్ట్ సరిగా పనిచేయకుండా ఆపుతుంది. అప్పుడు డయేరియా సమస్య వస్తుంది. ఇక చిన్నపిల్లల్లో విరోచనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది .కాబట్టి ఒక పించ్ మోతాదులో పసుపును వాడితే ఎటువంటి రోగాలు దరిచేరవు.