40 ఏళ్ళు వచ్చాయా? ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోండి!

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో ఈ వ్యాధుల బారిన పడటం సర్వసాధారణమైపోయింది. పురుషులు కూడా ఒక వయస్సుకి వచ్చిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన అన్ని చర్యలను తీసుకోవాలి. ఎందుకంటే అవి చాలా ముఖ్యమైనవి. చాలా మంది పురుషులకు 40 ఏళ్ల వయస్సులో అనేక రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వెనుక కారణాలు చాలా రకాల ఉండవచ్చు. కానీ పెరుగుతున్న వయస్సు కూడా ఆ సమస్యలు రావడానికి ఒక కారణమనే చెప్పాలి. అందుకే ప్రతి మనిషి కూడా 40 ఏళ్లకే హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఇక ఇందు కోసం మీరు 40 ఏళ్లకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని వైద్య పరీక్షలను చేయించుకోవడం ఎంతో ముఖ్యం.ప్రస్తుతం మధుమేహం సమస్యతో బాధపడటం చాలా సర్వసాధారణమైపోయింది. అలాగే ఈ వ్యాధి వృద్ధులనే కాకుండా చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా సోకుతుంది. కుటుంబ చరిత్ర ఉన్న కారణంగా ఇంట్లో ఉన్న పిల్లలు ఇంకా అలాగే పెద్దలకు సోకుతుంది. మీ తండ్రి తరచుగా బాగా ఒత్తిడికి గురవుతారు. అలాగే అతని దినచర్య కూడా చెదిరిపోతుంది.కాబట్టి ఖచ్చితంగా అతని బ్లడ్ షుగర్ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోమని చెప్పండి. మధుమేహం వంటి వ్యాధిని గుర్తించడం చాలా ఆలస్యం అని చెప్పాలి. అందుకే మధ్యలో పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే మీ నాన్నగారికి మధుమేమం  కనుక ఉన్నట్లయితే ఆహార నియమాలు సరిగ్గా పాటించాలని చెప్పండి.


ఇక అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రజలు తరచుగా 40 ఏళ్ల తర్వాత రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటారు. ఒత్తిడి, ఆహారం ఇంకా అలాగే వృద్ధాప్యం దీనికి ముఖ్యమైన కారణాలు. హై బీపీ సమస్యతో ఎవరినైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అతను చాలా కాలం పాటు మందులు వేసుకోవడం చాలా ముఖ్యం. అధిక బీపీ కారణంగా గుండెపోటు ఇంకా అలాగే కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా నిశ్శబ్ద కిల్లర్ వ్యాధి. దీనిని  అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఇక ఒక వ్యక్తికి థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్య కనుక ఉంటే ఈ స్థితిలో అతని బరువు బాగా పెరుగుతుంది. ఇంకా బరువు తగ్గడం కూడా ప్రారంభమవుతుంది. థైరాయిడ్ శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఈజీగా కలిగిస్తుంది. ఇందుకోసం TSH అనే పరీక్ష కూడా ఉంది. 40 సంవత్సరాల వయస్సులో ప్రతి వ్యక్తి స్త్రీ లేదా పురుషుడు అనే తేడా లేకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా పరీక్షులు చేయించుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: