అదే పనిగా ఫోన్ ను చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త...
స్మార్ట్ ఫోన్లు వచ్చాక చిన్నా-పెద్ద తేడా లేకుండా అందరూ అదే పనిగా ఫోన్ల కు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ ను స్క్రోల్ చేస్తూ గంటల కొద్దీ ఫోన్ల లోనే గడిపేస్తున్నారు.. ఇలా అవ్వడం వల్ల ఆయుష్హు కూడా తగ్గిపోతుందని అంటున్నారు. దాని గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఫోన్ తమ జీవనశైలి లో భాగం చేసుకున్నవారు మొత్తం జీవితం లో 34 సంవత్సరా లకు సమానంగా స్క్రీన్ చూస్తూ గడుపుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. దీని వల్ల ఫోన్ నుంచి ప్రసరితమయ్యే కాంతి మన కళ్ళ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ ఈగల పై ఒక ప్రయోగం చేసింది. దీని ద్వారా జీవుల కన్ను నేరుగానే మన ఆయుర్దాయాన్ని నియంత్రించగలదని చెప్తున్నారు పరిశోధకులు. కళ్ళకు హాని కలిగించే కాంతి పరోక్షం గా మనుషుల జీవిగడియారం పై ప్రభావితం చూపిస్తుందని అంటున్నారు. అందుకే రాత్రి సమయం లో కళ్ళకు ఎక్కువ కాంతి తగలడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లు, ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేయాలి.. చూసారుగా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఇప్పటికైన ఫోన్లను కాస్త దూరం పెట్టండి..