రోజూ ఈ జ్యూస్ తీసుకుంటే ఆనారోగ్య సమస్యలు రానేరావు!

Purushottham Vinay
ఇక ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్‌, నీరసం, అలసట ఇంకా అలాగే అధిక దాహం ఇలా ఎన్నో రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి.అందుకే సమ్మర్ అంటేనే చాలు తెగ భయపడిపోతుంటారు. అయితే వేసవిలో విరి విరిగా లభ్యమయ్యే మామిడి పండ్లను పుదీనాతో కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకోని తీసుకుంటే సమ్మర్ లో టెన్షన్‌నే పడక్కర్లేదు. మరి లేటెందుకు మ్యాంగో ఇంకా అలాగే పుదీనాను కలిపి ఎలా తీసుకోవాలి..? అసలు ఆ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ..? వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా దోరగా పండిన ఒక మామిడి పండును తీసుకుని దాని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అర గుప్పెడు పుదీనా ఆకులను కూడా తీసుకుని నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, పుదీనా ఆకులు ఇంకా ఐదారు గింజ తొలగించిన ఖర్జూరాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్‌, చిటికెడు నల్ల ఉప్పు ఇంకా చిటికెడు వేయించిన జీలకర్ర పొడి ఇంకా అలాగే అర లీటర్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మ్యాంగో ఇంకా మింట్(పుదీనా) జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ మ్యాంగో అండ్ మింట్ జ్యూస్‌ను వారంలో నాలుగు సార్లు గనుక తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.అలాగే వడ దెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. అధిక వేడి తొలగిపోయి శరీరం చాలా చల్లగా మారుతుంది. నీరసం, అలసట ఇంకా తలనొప్పి వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే రక్తపోటు అదుపులో ఉంటుంది.ఇంకా జీర్ణ వ్యవస్థ కూడా చురుగ్గా మారుతుంది. కాబట్టి, ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ మ్యాంగో మింట్ జ్యూస్‌ను తీసుకోవడానికి ప్రయత్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: