ఈ 5 టూర్లు వేస్తే అన్నీ చూసేసినట్టే !

Vimalatha
భారతదేశంలోని ఈ 5 అత్యుత్తమ ప్రదేశాలను చూశారంటే అన్ని రకాల ట్రిప్ లు వేసినట్టే. ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కొన్నిసార్లు బెస్ట్ ప్లేస్ దొరకక పోవచ్చు. అలాంటి వారి కోసం కొన్ని మంచి ప్రదేశాల గురించిన సమాచారం మీకోసం. మీరు ఒకసారి ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
కేరళ
దేవుని స్వంత దేశం అని పిలుచుకునే కేరళ ఒక సహజ స్వర్గం. ఇది విదేశీ, దేశీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం. బ్యాక్‌వాటర్ హౌస్‌బోట్ ను అనుభూతి చెందాల్సిందే. ఆస్వాదించాల్సిందే. ఇంతకు ముందు అలాంటి సహజ సౌందర్యాన్ని చూసి ఉండరు మరి. అయితే కేరళ వంటకాలు, ప్రజలు, ప్రకృతి వంటి వాటిలో కూడా చాలా స్పెషల్.
ఖజురహో దేవాలయం
దేశంలో మరొక ముఖ్యమైన గమ్యస్థానం. భారతీయ చరిత్ర లో కళ, చరిత్ర, ఆధ్యాత్మికత సమ్మేళనం, దేవాలయాలు ఒక భాగం. కాబట్టి ఆసక్తి గల విదేశీ పర్యాటకులు, పాశ్చాత్య నిపుణులు ఈ చక్కటి దేవాలయాలు, సున్నితమైన శిల్పాలను చూసి కళ్ళు తిప్పుకోలేరు.
గోవా
మీరు పార్టీ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా గోవా కు వెళ్లాల్సిందే. కాబట్టి చాలా మంది టూరిస్టుల కు గోవా అంటే ఇష్టం. మీరు ఆ గోవాను చూడకపోతే జీవితంలో చాలా మిస్ అవుతారు. ఇక్కడ మీరు ఎప్పటికీ మర్చిపోలేని సెలవు దినం ఎంజాయ్ చేస్తారు అనడంలో సందేహం లేదు. సందడిగా ఉండే బీచ్‌ ల నుండి ఓల్డ్ గోవా లోని పోర్చుగీస్ వైపు వెళ్లొచ్చు.
తాజ్ మహల్
ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మీరు ఎన్నిసార్లు సందర్శించినా ఆకట్టుకునేలా చేస్తుంది. ఒక విదేశీయుడు మొదటిసారి లేదా రెండవసారి దేశాన్ని సందర్శించినప్పుడు తాజ్ మహల్ ఎప్పుడూ చూడవలసిన ప్రాంతాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది.
మనాలి
ఏదైనా నార్త్ ఇండియన్‌కి ఇష్టమైన డ్రైవింగ్ హాలిడే గురించి అడగండి. సమాధానం దాదాపు మనాలి. అది హిమాచల్ ప్రదేశ్ హీరో.  హిమాలయాల ఎత్తైన శిఖరాలు ఆకర్షిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: