ఇద్దరి వ్యక్తుల భోజనానికి 15000

Manasa
ఇద్దరి వ్యక్తుల  భోజనానికీ  15000 రూపాయలు బిల్ వేస్తే వామ్మో ఇది మా ఒకరిదేనా లేక హోటల్ లో ఉన్న వారందరిదా అని అనిపిస్తుంది కదా. అవును హైదరాబాద్ లో ఒక హోటల్ లో ఎవరైనా భోజనం చేయాలి అని అనుకుంటే కనుక  బిల్ ఇది . మన హైదరాబాద్  లో ఎన్నెన్నో  హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా వరకు ఎక్కడా డే కాడ్నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ మరియు కంఫర్టబుల్ కూడా.భారతదేశం అంతటా చూసుకుంటే కనుక హైదరాబాద్ లో హోటల్స్ కాస్ట్ తక్కువ. కానీ మన ఈ హైదరాబాద్  లో 8 కాస్టలీ రెస్టురంట్స్ ఉన్నాయి. ఆ రెస్టురంట్స్ లో ఇద్దరు కలిసి కాసుఅల్ డైనింగ్  చేయాలంటే మినిమం 3000,7500,15000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వామ్మో ఇద్దరికీ అంత ఐతే ఒక పది మంది కలిసి వెళ్తే ఇంకా బిల్ చూసాక చుక్కలే అనుకోవచ్చు. మరి హైదరాబాద్ లో ఆ   8  ఎక్సపెన్సివ్ రెస్టురంట్స్ ఏవీ అంటే…
గోల్ బంగ్లా– తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
ఇది చాలా ఎక్సపెన్సివ్ రెస్టురంట్. ఇందులో ఇద్దరి వ్యక్తుల భోజనానికి వచ్చే ఖర్చు 15000 రూపాయలు.
అదా- తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
ఇక్కడ 7500 రూపాయలు,ఇద్దరికి.
సెలస్టే-తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
7500  రూపాయలు బిల్ కట్టి ఇద్దరు వ్యక్తులు హాయిగా భోజనం చేయవచ్చు.
ప్రీగో - ది వెస్టిన్ (వెస్టిన్ హోటల్)
ఇందులో ఇద్దరు వ్యక్తులు కలిసి  తినాలి  అనుకుంటే య్ మినిమం 5000 రూపాయలు.
థాయ్ పెవిలియన్ - వివాంత బై తాజ్
ఇందులో 2 కి  4000 -5000  రూపాయలు.
కేబాబ్స్ & కుర్రిస్ – ఐటీసీ కాకతీయ
ఇందులో టాక్స్ కలుపొకుండా మినిమం 3500 రూపాయలు.
బిద్రి - మారియట్ హోటల్
ఈ హోటల్ లో ఇద్దరికి 3000 రూపాయలు.
జెవెల్ ఆఫ్ నిజాం
ఇద్దరి వ్యక్తుల సాధారణ భోజనానికి ఈ హోటల్ లో 3000 రూపాయలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: