చవితి : కరోనా .. మా జేబుకు చిల్లు పెట్టావ్ కదే..
ఇది పండగల సీజన్, ఈ కొద్దికాలం వృత్తి, వ్యాపారాలు చేసుకొని జీవితాలు వెళ్లబుచ్చుకునే వాళ్ళు బోలెడు మంది. చెప్పాలంటే ఒక్క పండగ వస్తే దానిపై బ్రతికే వాళ్ళు ఎందరో ఉంటారు. ఉదాహరణకు ఈ వినాయక చవితినే తీసుకోండి, ఆయన విగ్రహాల తయారీ దారుల నుండి, దానికి కావాల్సిన వనరులు అమ్మేవారు కానివ్వండి, వాటికి అలంకారాలు చేసేవారు కానివ్వండి, పూజల నిమిత్తం ఆయా పూలు, గట్రా సామాగ్రి ఉత్పత్తిదారులు, వాటిని మండపాల వరకు తెచ్చేవారు కానివ్వండి, ఇక పూజలు చేసే పూజారుల వరకు ఎందరో ఈ ఒక్క పండగపై ఆధారపడ్డారు.
ఈ కరోనా చేయగా వీళ్ళందరూ బాధితులైనట్టే కదా. సాధారణ పరిస్థితులలో అయితే వీరందరికి కనీస ఆదాయం ఉండేది. ఇప్పుడు అది అంతా పాయె. రెండేళ్ల క్రితం మండపాలకు పూజారులు దొరకక, కుదిరిన వేళలో పూజలు నిర్వర్తించేవారు. కానీ ఇప్పుడు వీరికి ఆ ఆదాయం అంతా పోయినట్టే కదా. బహుశా వీరందరూ కరోనా ను బాగా తిట్టుకోక మానరు. ఎప్పుడు ఈ సీజన్ లో ఎంతో బిజీగా ఉండే వీళ్లు ఈసారి మాత్రం పూజారులు గుళ్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే విగ్రహాల తయారీ దారులకు ఉద్దీపనలు ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా వీరు కొంతైనా నష్టాల నుండి బయట పడతారు. వీరిని పట్టించుకుంటున్న ప్రభుత్వాలను శభాష్ అనకుండా ఎలా ఉండగలం.