పెళ్ళిలో ఇవన్నీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
అవును! "ఏడడుగుల బంధానికి పెద్దలు ఏడు సూత్రాలు తెలియజేశారు, మరీ ముఖ్యంగా ఆ ఏడు సూత్రాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి." బంధానికి ఏడు పెళ్లి సమయంలో మనం ఎంత స్వచ్ఛమైన మనసు మరియు శ్రద్ధతో పద్ధతులు పాటిస్తామో తర్వాత అవే దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.
ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇక ముందు జరగనీయకుండా జాగ్రత్త పడదాం
జీలకర్ర బెల్లం పెట్టాక వధూవరులు ఒకరినొకరు సరిగ్గా చుస్కోకపోవడం.
ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ తగ్గిపోవడం.
మాంగళ్య ముహూర్తానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం..
ఫలితం:- దీనివల్ల వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవడం, మంచి సంతానం పొందకపోవడం.
తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవడం.
ఫలితం:- దీనివల్ల బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు.
వధూవరులను ఆశీర్వదించేటపుడు బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోకి రావడం.
ఫలితం:- అలా చేయడం వలన మన మంటపంలో హోమం చేసి ఆవాహన చేసిన దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
బఫే భోజనం.
ఫలితం:- బఫే భోజనాల వల్ల అన్నదాన ఫలితం ససేమిరా దక్కదు.
సినిమా పాటల్లో లీనమైపోయి వేదమంత్రాలు వినకపోడం.
ఫలితం:- దీనివల్ల దైవ కటాక్షం దూరమవ్వడం.
ఇవే కాదు ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంలో సంప్రదాయాలను అనుసరిస్తూ కళ్యాణం జరుపుకొని , మంచి జీవితం గడుపుతూ,మంచి సంతానం పొంది,భగవంతుడి కృపకు పాత్రులుకండి ఇవన్నీ శాస్త్రంలో ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు