ఈ చలికాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
ఈ చలికాలం ఈ సీజన్‌లో ఖచ్చితంగా కూడా ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఆస్తమా రోగులు  మరింత అలెర్ట్‌గా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. ఈ సీజన్‌లో ఆస్తమా రోగుల శ్వాసనాళాలు ఉబ్బిపోవడం వల్ల ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతుంటాయి. అందువల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆస్తమా రోగులు తమను తాము ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి.ఇంకా అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించడంతో పాటు కొన్ని ఫుడ్స్‌కు కూడా చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు చలికాలంలో చల్లని, పుల్లని పదార్థాలకూ చాలా దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఐస్ క్రీం, చల్లటి నీరు, నిమ్మకాయ ఇంకా పచ్చి పెరుగు మొదలైన వాటిని తీసుకోవడం వల్ల ఉబ్బసం సమస్యలు తీవ్రతరం అవుతాయి.


ఇంకా అలాగే దగ్గు సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెడతాయి.చాలా మంది కూడా ఈ చలికాలంలో కప్పుల కొద్దీ టీలు, కాఫీలు లాగేస్తుంటారు. ఈ కాలంలో , ఒక కప్పు టీ లేదా కాఫీ శరీరాన్ని వేడి చేస్తుంది, అయితే ఆస్తమా రోగులు ఎక్కువగా టీ లేదా కాఫీని తాగకూడదు. ఎందుకంటే టీ లేదా కాఫీ అనేది ఆస్తమా రోగుల సమస్యను బాగా పెంచుతుంది. నిజానికి టీ, కాఫీలు తాగడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అందువల్ల ఇది ఆస్తమా సమస్యలను మరింత పెంచుతుంది. ఇక డైట్‌ విషయానికొస్తే.. వీరు పప్పులు, కూరగాయల్లో లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, దాల్చినచెక్కను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా అలాగే మెంతికూర తినడం కూడా అలవాటు చేసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ఇంకా అలాగే అల్లం టీని రోజుకు రెండుసార్లు తాగాలి. అయితే పాలు లేకుండా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: