ఈ డ్రింక్ తాగితే ఎలాంటి రోగాలు రానే రావు?

Purushottham Vinay
మన పూర్వ కాలం నుంచి మన పెద్దలు ఆహారంగా తీసుకుంటున్న రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఎముకలను బాగా ధృడంగా చేస్తాయి. నిద్రలేమి, వ్యాకులత, ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు రాగులను రోజూ తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల మనకు తగినంత అయోడిన్ లభిస్తుంది. రాగులతో చేసిన ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు కలుగుతుంది. రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. రాగులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్య తగ్గుతుంది. రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.రాగులను పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. రాగులను వేయించి పిండిగా చేయాలి.


ఈ రాగి పిండిని బియ్యంతో కలిపి వండుకుని తింటే నీరసం తగ్గుతుంది. రాగులతో మనం రుచిగా జావను కూడా తయారు చేసుకోవచ్చు.ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో కొద్దిగా నీటిని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఉండలు లేకుండా కలుపుకుని రాగి పిండిని వేసి పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి జావ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న రాగి జావను నేరుగా తాగవచ్చు లేదా దీనిలో మజ్జిగ, ఉప్పును వేసి కూడా తీసుకోవచ్చు.ఈ విధంగా తీసుకోవడం వల్ల నీరసం, ఆందోళన తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది.రాగి జావలో పంచదార, పాలను కూడా కలిపి తయారుచేయవచ్చు. ఇలా పాలు , పంచదార వేసి తయారు చేసిన రాగి జావను పిల్లలకు ఇస్తే వారిలో ఎముకలు ఎంతో పుష్టిగా తయారవుతాయి. వారి ఎదుగుదల కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: