బుడుగు: పిల్లలు పండ్లు, కూరగాయలు తినడం లేదా.. ఇలా చేయండి..!?

N.ANJI
సాధారణంగా చిన్న పిల్లలకు పోషకాహారం అందించడం చాలా అవసరం. పోషకాహారం వారిని సంపూర్ణ ఆరోగ్యాంగా ఉంచడానికి దోహదపడుతుంది. కాగా.. పిల్లలు మాత్రం కూరగాయలు, పండ్ల కంటే చిరుతిళ్ల వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో వారికీ సరైన పోషకాలు అందవు. ఇక లంచ్ సమయాన్ని పెంచడం వల్ల ఈ సమస్యను పరిష్కరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇక పిల్లలు లంచ్ బ్రేక్ ను 10- 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంటారు. ఆలా షెడ్యూల్ చేసిన లంచ్ సమయం ఎక్కువ ఉన్నప్పటికీ విద్యార్థులు తినే సమయం చాలా తక్కువని ఫుడ్ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మెలిసా ఫ్లా ప్రెస్కోట్ వెల్లడించారు. అయితే తినే సమయం తక్కువగా ఉండటం వల్ల చిన్నారుల తమ ఆహారంలో పండ్లు, కూరగాయలు చాలా తక్కువ తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. అంతేకాక.. పానీయాలు, డ్రింక్స్ కూడా తక్కువ మోతాదులోనే తీసుకుంటారని, అదే తినే సమయం ఎక్కువ ఉంటే పండ్లు, కూరగాయలు కూడా తీసుకునే అవకాశముంటుందని వెల్లడించారు..
అయితే ఈ పరిశోధనను మెలిసా తన సహచరులతో కలిసి ఇల్లినాయిస్ వర్సిటీలో నిర్వహించారు. ఇక ఇక్కడ విద్యార్థులు లైన్ గుండా వెళ్లి వారి ఆహారాన్ని ఎంచుకునేలా ఏర్పాటు చేసారు. అయితే నేషనల్ స్కూల్ లంచ్ ప్రోగ్రాం మార్గదర్శకాల ప్రకారం ఈ భోజనం ఏర్పాటు చేశారు. కాగా.. ప్రతిరోజు స్వల్ప లేదా దీర్ఘకాలిక భోజన సమయాన్ని కేటాయించేలా ఏర్పాటు చేశారు. అంతేకాదు.. రెండు సమయాలకు ఒకే విధమైన భోజన మెనూను తయారు చేశారు.
కాగా.. పిల్లలకు భోజనం వడ్డించిన దగ్గర నుంచి వారు తినడం పూర్తయ్యే వరకు లంచ్ లో కూర్చొన్న సమయాన్ని గమనించారు. అంతేకాదు.. భోజనం తినేటప్పుడు వారి ప్రవర్తనను వారు గమించారు. ఇక లంచ్ పూర్తయిన తర్వాత ఆహారం రుచి, రూపం గురించి రెండు ప్రశ్నల సర్వేను నిర్వహించి.. వారి ఎంతమేరకు తిన్నారో సమగ్రంగా అంచనా వేసారు. అయితే కూరగాయల కంటే పండ్లు, అధికంగా వినియోగించినప్పటికీ దీర్ఘకాలిక భోజన సమయంలో ఈ రెండింటిని ఎక్కువగా తీసుకున్నారని మెలిసా తెలియజేశారు. కానీ.. భోజన సమయం తక్కువగా ఉన్నప్పుడు కూరగాయలు, పండ్లు తీసుకోవడం గణనీయంగా తగ్గిందని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: