కిడ్స్ స్టోరీ : ది ఫ్రాగ్ అండ్ ది ర్యాట్... మూర్ఖుడితో స్నేహం !

Vimalatha
ఒకానొకప్పుడు ఒక కప్ప ఒక చిన్న జలాశయంలో నివసించేది. దానికి స్నేహితులు ఎవరూ లేరు. కాబట్టి అది ఎప్పుడూ చాలా విచారంగా ఉండేది. తనలోని దుఃఖం, ఒంటరితనం పోవాలంటే మంచి స్నేహితుడిని పంపమని దేవుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేది ఆ కప్ప. ఆ రిజర్వాయర్ దగ్గర చెట్టు కింద ఒక బిలం ఉండేది. అందులో ఒక ఎలుక నివసించేది. అది చాలా ఉల్లాసమైన స్వభావం కలది. ఒక రోజు కప్పను చూడగానే దాని దగ్గరకు వెళ్లి "మిత్రమా ఎలా ఉన్నావు?" అది అడిగింది. ఎలుక ప్రశ్నకు కప్ప విచారకరమైన స్వరంతో “నేను ఒంటరిగా ఉన్నాను. నాకు స్నేహితులు ఎవరూ లేరు. అందుకే నాకు చాలా బాధగా ఉంది" అని చెప్పింది ఎలుకతో.
కప్ప విచారం చూసిన ఎలుక దిగులు చెందవద్దు. నేను నీకు స్నేహితుడిగా ఉంటాను. నువ్వు నాతో సమయం గడపాలనుకున్నప్పుడు నా బిలం దగ్గరకు రావచ్చు" అని చెప్పింది. ఎలుక మాటలు విన్న కప్ప చాలా సంతోషించింది. ఆ రోజు తర్వాత ఇద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. వారిద్దరూ రిజర్వాయర్ ఒడ్డున గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు కప్ప చాలా సంతోషంగా ఉంది.
ఒకరోజు కప్ప “ఈ తాడు రెండు చివరలను మన పాదాలకు కట్టుకుందాం. నేను నిన్ను మిస్ అయినప్పుడల్లా తాడు లాగుతాను. నీకు తెలుస్తుంది" అని చెప్పగా, ఎలుక దానికి అంగీకరించింది. అనుకున్నట్టుగానే ఇద్దరూ పాదాలకు తాడును కట్టుకున్నారు. ఆకాశంలో ఎగిరే డేగ ఇదంతా చూస్తూనే ఉంది. ఎలుకను తన ఆహారంగా మార్చుకోవడానికి దానిపైకి దూసుకెళ్లింది. అది చూసి భయపడిన కప్ప తన ప్రాణాలను కాపాడుకోవడానికి రిజర్వాయర్‌లోకి దూకింది. కానీ హడావుడిగా తాడు మరో చివర తన స్నేహితుడు ఎలుక కాలికి కట్ట ఉందనే విషయం మర్చిపోయింది. ఇంకేముంది కప్ప వల్ల ఎలుక కూడా నీటిలో మునిగిపోయి చనిపోయింది.
కొంచం సేపటి తర్వాత ఎలుక మృతదేహం రిజర్వాయర్ ఉపరితలంపై తేలడం ప్రారంభించింది. అది చూసి గద్ద నీటిలో తేలియాడుతున్న ఎలుక కళేబరాన్ని దాని పాదాలలో పట్టేసుకుంది. తాడు మరో చివర కప్ప కాలికి కట్టబడి ఉండడంతో అది కుల గడ్డకు ఆహారం అయిపొయింది.
నీతి : మూర్ఖుడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: