జులై 27:చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనలు విషయానికి వస్తే..ఇక 1929 వ సంవత్సరంలో జెనీవా కన్వెన్‌షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను 53 దేశాలు కలిసి రూపొందించడం జరిగింది.ఇక 1957 వ సంవత్సరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేది ఏర్పాటైంది.ఇక చరిత్రలో జరిగిన జాననాల విషయానికి వస్తే..1911వ సంవత్సరంలో సంగం లక్ష్మీబాయి జన్మించారు. ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు ఇంకా భారత లోక్ సభ సభ్యురాలు.1935 వ సంవత్సరంలో వెలుదండ రామేశ్వరరావు జన్మించారు. ఇక ఆయుర్వేద ఇంకా హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. అలాగే ఈయన చాలా రచనలు కూడా చేశారు.ఇక వాటిలో కొన్ని ముద్రితంగా జరిగాయి. అలాగే కొన్ని అముద్రితం జరిగాయి.1948 వ సంవత్సరంలో ఎం. వి. ఎస్. హరనాథ రావు జన్మించారు. ఈయన ఓ గొప్ప నాటక రచయిత ఇంకా సినీ మాటల రచయిత అలాగే మంచి నటుడు కూడా.

ఇక 1955 వ సంవత్సరంలో అలాన్ బోర్డర్ జన్మించారు. ఈయన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.1960 వ సంవత్సరంలో సాయి కుమార్ జన్మించాడు. ఈయన తెలుగు సినిమా నటుడు అలాగే మంచి డబ్బింగ్ కళాకారుడు.ఇక 1963 వ సంవత్సరంలో కె. ఎస్. చిత్ర జన్మించారు. ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయనిగా పేరు సంపాదించారు.ఇక 1953 వ సంవత్సరంలో కత్తి పద్మారావు జన్మించారు. ఈయన ఓ మంచి రచయిత అలాగే మంచి సంఘ సంస్కర్త.ఇక 1936 వ సంవత్సరంలో అయ్యల సోమయాజులు మరణించారు. ఈయన ఒక మంచి గణపతిశాస్త్రి ఇంకా మంచి పండితుడు ఇంకా జ్యోతిష్యుడు అలాగే ఆధ్యాత్మికవేత్త.1970 వ సంవత్సరంలో పి.ఏ.థాను పిళ్లై మరణించారు. ఈయన  భారత స్వాతంత్ర్య సమరయోధుడు.ఇక 2003 వ సంవత్సరంలో ఆవుల సాంబశివరావు మరణించారు. ఈయన మంచి న్యాయవాది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త. అలాగే హేతువాది ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్.2015 వ సంవత్సరంలో ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ మరణించారు. ఈయన ఓ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త అలాగే భారత మాజీ రాష్ట్రపతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: