వెల్లుల్లి: ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు?

Purushottham Vinay
వెల్లుల్లి అనేది దాదాపు ప్రతిఒక్కరి వంటింట్లోను ఉంటుంది.చాలామంది వెల్లుల్లిని ఆహారంలో మంచి రుచి ఇంకా సువాసన కోసం ఉపయోగిస్తారు.ఇంకా అదే సమయంలో వెల్లుల్లి వినియోగం కొన్ని వ్యాధులు, సమస్యలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చాలామంది ఈ వెల్లుల్లిని తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి? మరి దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి..


వెల్లుల్లి తినడం వల్ల కలిగే నష్టాలు..


వాంతులు, విరేచనాల సమస్య: వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల వాంతులు ఇంకా విరేచనాలు అవుతాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకుంటే మీ కడుపులో మంట సమస్య కూడా ఎక్కువగా తలెత్తుతుంది. అందుకే వెల్లుల్లిని తినేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.


ఇంకా కాలేయానికి హానికరం: వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. పచ్చి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కాలేయంలో యాసిడ్ అనేది పేరుకుపోతుంది. దీని వల్ల మీకు ఎన్నో సమస్యలు రావచ్చు. అందువల్ల మీరు ఈ వెల్లుల్లిని ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు.


అలాగే తల తిరగడం: పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల తలతిరగడం లాంటి సమస్యలు మీకు వస్తాయి. అదే సమయంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందని, దీని వల్ల మైకము కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.ఇంకా అలాగే ఈ వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి చాలా హాని కలుగుతుంది. అందుకే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈ వెల్లుల్లిని నివారించాలి. ముఖ్యంగా గర్భిణులు ఇంకా బాలింతలు వెల్లుల్లి తినడం మానుకోవాలి. ఇక అంతే కాకుండా చాలా చిన్న పిల్లలకు వెల్లుల్లి తినిపించడం చాలా మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: