మూత్రం నుండి రక్త స్రావం జరుగుతోందా.. కారణం..?

Divya
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పవచ్చు. రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, తదితర క్యాన్సర్ బారిన పడిన కేసు లు చాలానే ఉన్నాయి. కానీ ప్రజలకు దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. చాలా సందర్భాలలో వీటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. దీంతో చికిత్స సమయం ఏర్పడుతుంది. కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు అనేది ఎలా ఉంటాయి.. వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం జీవనశైలి సరిగా లేకపోవడం ధూమపానం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వారు.. ఎక్కువగా కిడ్నీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మూత్రంలో రక్తం రావడం ప్రారంభమవుతుంది. కిడ్నీ లో కణితి ఏర్పడడం వల్ల ఈ కణతి క్రమంగా పెరుగుతూ శరీరంలో పెద్దగా ఏర్పడుతుంది. దీంతో మూత్రంలో రక్తం తో పాటు నడుము కింద భాగంలో నిరంతరం నొప్పి, ఆకలి వేయకపోవడం, కాళ్ల వాపు, బరువు తగ్గడం వంటివి క్యాన్సర్ లక్షణాలని చెప్పవచ్చు.
ఎక్కువగా మధుమేహం , ఊబకాయం వంటి సమస్యలు ఇబ్బంది పడే వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. అయితే మొదటి లక్షణాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని వైద్యులు తెలియజేస్తున్నారు. మూత్రం రంగు మారడం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం, కిడ్నీ వ్యాధికి సంకేతం అని చెప్పవచ్చు. ఈ వ్యాధిబారిన కేవలం 40 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఈ వ్యాధి నివారించాలంటే ధూమపానం, బీపీని అదుపులో ఉంచుకోవడం, ప్రతిరోజు వ్యాయామం, శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంచుకోవడం వంటివి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: