ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాల్సిందే!

Purushottham Vinay
ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లని ఫాలో అవుతుంటారు. ఇక ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండాఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ కూడా మనం తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. అవేంటో చూద్దాం.ఇక పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్లు ఇంకా గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం ఇంకా మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటంలో బాగా సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి.అలాగే మనం తరచూ తినే పప్పుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఫైబర్‌ ఇంకా ప్రోటీస్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా బాగా సహాయపడుతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడంలో కూడా సహకరిస్తాయి.


పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్‌ ఇంకా అలాగే జింక్ కూడా లభిస్తాయి.ఇక మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఎక్కువగా రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు చాలాకాలం కూడా ఆరోగ్యంగా జీవించారు. ఈ మిల్లెట్లలో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా కూడా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు కేన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా ఈ మిల్లెట్లు తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది చాలా మంచి ఆహారం.అలాగే మన వంట్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు ఇంకా మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: