కరోనా వచ్చిన వారికే ఓమిక్రాన్ వస్తుందట...!
ప్రధానంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారికే ఓమిక్రాన్ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సింగపూర్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన 37 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. ఇతను ఈ నెల ఒకటవ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది. కొన్ని రోజులుగా తమ దేశానికి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీ పరీక్షించామన్నారు. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ కేసులకు సంబంధించి నివేదికలను సమీక్షించామన్నారు వైద్యులు. అయితే వీటిల్లో ఎక్కువగా గతంలో కరోనా వచ్చిన వారికే మరోసారి ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఓమిక్రాన్ వేరియంట్ గురించి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు వైద్యులు. అదే సమయంలో ఓమిక్రాన్ వేరియంట్పై వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉంటుదనే అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు శాస్త్రవేత్తలు. తీవ్రమైన అనారోగ్యం నుంచి ప్రజలను రక్షించడంలో ప్రస్తుత వ్యాక్సిన్లు సమగ్రంగా పని చేస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ డోసులను ప్రతి ఒక్కరు తప్పని సరిగా వెంటనే తీసుకోవాలన్నారు. అలాగే బూస్టర్ డోసుల కోసం కూడా తొందర పడాలని సూచించారు.