కొత్త వేరియంట్ లకు.. కోవిషిల్డ్ భేష్.. !
ఇప్పుడు మళ్ళీ భారత వాక్సిన్ ను ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంది. దేశంలో కూడా ఇప్పటికే వంద కోట్ల వాక్సిన్ లను పంపిణి చేసి, ఆ విజయంపట్ల ఆనందాన్ని ప్రధాని తన ప్రజలతో పంచుకున్నారు కూడా. వాక్సిన్ ఉత్పత్తి ని బట్టి, ప్రమాదానికి బాగా దగ్గరగా ఉన్నవారికి ముందు కేటాయించారు. అంటే వైద్య రంగంలో ఉన్నవారిని, ఇతర ఫ్రంట్ లోనే కార్మికులకు, అలాగే 45 ఏళ్ళ వయసువారికి ప్రధానంగా వాక్సినేషన్ చేయడం జరిగింది. అనంతరం 18 ఏళ్ళు దాటిన వారికీ కూడా పంపిణి జరుగుతూనే ఉంది. అతి కొద్ది కాలంలో పిల్లలకు కూడా వాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
తాజాగా భారత్ లో తయారైన వాక్సిన్ ల ప్రభావం కొత్త వేరియంట్ల పట్ల ఆశాజనకంగా ఉందని వివిధ అధ్యయనాలతో తేల్చారు. ముఖంగా కోవిషిల్డ్ డెల్టా లాంటి వేరియంట్లపై 90శాతం ప్రభావవంతంగా ఉన్నట్టు ఈ నివేదికలు వెల్లడించాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాదాపు 54 లక్షల మందికి పైగా డేటాను పరీక్షించి ఈ నివేదికలు తయారు చేశారు. ఈ సమయంలో 115000మంది కరోనా వైరస్ బారిన పడగా, 201 మంది మృతి చెందారు. వైరస్ బాధితులను ప్రాణాపాయం లేకుండా కాపాడటంలో ఈ టీకాలు బాగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం స్కాట్లాండ్ లో ఈవ్-2 అనే సంస్థ నిర్వహించింది.