మనిషికి.. జంతువుల కిడ్నీ..!
అలాగే మనిషి సహజంగా ఒక జంతువు నుండి ఆవిర్భవించాడు అంటున్నారు కాబట్టి ఆ జంతువు అవయవాలు మనిషికి సరిపోతాయా అనేది కూడా ఆలోచించారు ఈ శాస్త్రవేత్తలు. అలాంటివి ప్రయోగాత్మకంగా చేసినప్పటికీ పెద్దగా అంటే అతికొద్ది కాలం మాత్రమే ప్రయోజనం కలిగింది. అలా కాకుండా సాధారణ మనిషి అవయువం మాదిరి మార్పిడి జరిగిన తరువాత కూడా పనిచేసే విధంగా ఉండాలన్నది వారి లక్ష్యం. దానికోసం ఇటీవల ఒక మనిషికి పంది కిడ్నీ ని అమర్చారు. దీనివలన అతడి ప్రాణం నిలబడింది కానీ, అది ఎన్నాళ్ళు అలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. పందిలో కూడా మానవ శరీర నిర్మాణం తరహాలో కొవ్వును పలచగా చేసే ఏర్పాటు ఉండటం చేత ఈ ప్రయోగం ఫలిస్తుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జంతువుల అవయవాలను మానవులకు అమర్చడం పదిహేడవ శతాబ్దంలోనే ప్రారంభం అయినప్పటికీ, ఇప్పుడిప్పుడే అది మళ్ళీ ఆవశ్యకతమని అర్ధం అవుతుంది. అందుకే కొందరికి ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కూడా చైనా ఒక అడుగు ముందే ఉంది. అవయవాలు పాడైపోయిన వారికి ఆయా జంతువుల భాగాలతో మార్పిడి చేసి ప్రాణాలను రక్షిస్తున్నారు అక్కడి వైద్యులు.