ఆంక్షలు ఎత్తివేత !
కరోనా మహమ్మరి పై భారత దేశంతో పాటు , ప్రపంచ దేశాలలో భయాందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐరోపా సమాజంలో ఓ దేశం కరోనాపై గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఉపసంహరించింది. దాదాపు 550 రోజల పాటు అమలులో ఉన్న నిషేధాజ్ఞలను డెన్మార్క్ దేశం తొలగించింది. ఐరోపా సమాజంలో కరోనా పై ఎలాంటి ఆంక్షలు అమలులో లేని తొలి దేశమేంది.
కరోనాకు సంబంధించి గతంలో అమలులో ఉన్న నిబంధనలను, తప్పనిసరిగా, ఇంకా చెప్పాలంటే. విధిగా కలిగి ఉండాల్సిన కరోనా పాస్ లను కూడా డెన్మార్క్ ప్రభుత్వం రద్దు చేసింది. ఐరోపా సమాజంలోని ఈ దేశం కోవిడ్ - 19ను సామాజికంగా క్లిష్టమైన వ్యాధి గా నిర్దారించింది. అధికార యంత్రాంగం ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ...నైట్ క్లబ్ లతో సహా అన్ని వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. అంతే కాకుండా మహమ్మారి పూర్తి స్థాయిలో అదుపులో ఉందని డానిష్ ప్రభుత్వం ప్రజలకు భరోసానిచ్చింది. 2020 మార్చి నెలలో డెన్మార్క్ ప్రభుత్వం ఐరోపా సమాజంలో తొలిసారిగా లాక్ డౌన్ ను విధించింది. పలు ఆంక్షలు పెట్టింది . ఆ దేశ ప్రధాని ఫెడ్రిక్సన్ ఆంక్షల పై ప్రకటన చేసినట్లు ఆ దేశ ప్రసార మాధ్యమాలు తెలిపాయి.
డెన్మార్క్ ప్రజలు సమాజిక దూరం పాటించడంలో ప్రపంచ దేశాల ప్రజల నుంచి ప్రశంసలు పొందారు. డెన్మార్క్ 5.8 మిలియన్ల జనాభా ఉన్నారు. ఈ సెప్టెంబర్ తొలివారం నాటికి దాదాపు 73 శాతానికి పైగా టీకాలు వేసే కార్యక్రమం పూర్తయింది. దాదాపు 8.6 మిలియన్ల టీకా డోసులను ప్రజలకోసం వినియోగించారు. ఈ ఐరోపా దేశంలో ఇప్పటి వరకు 352,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.డెన్మార్క్ ప్రస్తుతం అన్ని సవాళ్లను అధికమించిన తొలి ఐరోపా దేశంగా చరిత్ర సృష్టించింది.