నిఫా వ్యాప్తి కరోనా కంటే తక్కవే..!
కరోనా కన్న నిఫా వైరస్ వ్యాప్తి తక్కువ గానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా అంతా పెద్ద అంటు వ్యాధి కాదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. కరోనా తో పోలిస్తే నిఫా వైరస్ చాలా ప్రమాదకరమైనదగా మారుతోందని వారు అన్నారు. నిఫా వైరస్ వ్యాప్తి కి మొదటి కారకం గబ్బిలం. ఈ గబ్బిలాలు ఖర్జూర పండ్లను ఎక్కువగా తింటాయి. ఇవి ఖర్జూర పండ్లు తిన్న సమయంలో నిఫా వైరస్ ఉన్న గబ్బిలాల లాలాజలం లేదా మూత్రం వంటి స్రావాలు పండ్లకు, చెట్టుకు అంటుకుంటాయి. వాటిని మనుషులు తాకితే వారికి నిఫా వైరస్ సోకుతుంది. అలాగే నిఫా వైరస్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉంది. వైరస్ సోకిన వారి శరీర స్రావాలు ఇతరులకు అంటితే వారికి నిఫా వైరస్ వస్తోంది. మన దేశంలో గతం వచ్చిన నిఫా వైరస్ కేసులు ఈ రకానికి చెందినవే కావడం గమనార్హం.
నిఫా వైరస్ సోకిన వ్యక్తుల్లో కొంత మందికి స్వల్ప లక్షణాలు ఉంటాయి. మరి కొందరికి తీవ్ర మైన లక్షణాలు సైతం ఉంటాయి. వైరస్ సోకిన కొంత మందికి మెదడు వాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. దీనితో ఆ వ్యక్తి మృతి చెందే అవకాశం ఉంది. వీటితో పాటు జ్వరం, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి. మెదడు వాపు వచ్చిన వారు ఒకటి రెండు రోజుల్లో కోమాలోకి పోయే ప్రమాదం ఉంది.