ఎండు ద్రాక్షతో ఆ సమస్యకు చెక్... ముఖ్యంగా అబ్బాయిల్లో...
ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఎండు ద్రాక్ష తీసుకోవాలి. ఇవి ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి దివ్యౌషధం. ఎండు ద్రాక్షను నానబెట్టి తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ప్రతిరోజూ ఉదయం 10-20 గ్రాముల ఎండు ద్రాక్షను నానబెట్టి తినాలి.
మలబద్ధకం : ఎండుద్రాక్ష మలబద్ధకం తొలగిస్తుంది. మలబద్ధకం, అసిడిటీ, అలసట వంటి సమస్యలు ఉంటే ఎండుద్రాక్షతో వాటిని పారద్రోలొచ్చు.
రక్తం : విటమిన్ బి కాంప్లెక్స్ ఎండుద్రాక్షలో కావాల్సినంత ఉంటుంది. దీని వలన శరీరంలో రక్తం పెరుగుతుంది.
నానబెట్టిన ఎండుద్రాక్ష : లావుగా అవ్వాలనుకుంటే ఎండుద్రాక్షను ఆహారంలో చేర్చుకోండి. నానబెట్టిన ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరుగుతుంది. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బరువును పెంచడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటు : ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది.
ఇందు లో రాగి కూడా ఉంటుంది. దీని వలన ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. ఎండుద్రాక్ష లో విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్, సెలీనియం ఉంటాయి. ఎండుద్రాక్ష ను టెస్టోస్టెరాన్ పెంచే ఆహారాల కేటగిరీ లో లెక్కిస్తారు. ఇది అలాంటి హార్మోన్, ఇది పురుషుల లైంగిక సమస్యలను తొలగించడానికి, వారి వివిధ శారీరక సమస్యలను అధిగమించడానికి సమర్థవంతంగా పని చేస్తుంది.