మహిళలకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా..?

MOHAN BABU
ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులు, గృహిణులు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే తరచూ పని ఒత్తిడిని ఎదుర్కొనే మహిళల్లో గుండెపోటు ముప్పు అధికంగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయని మొన్నటి వరకు అధ్యయనాలు  తెలిపాయి.  కానీ గుండెజబ్బులకు దారితీసే కారకాల్లో పని ఒత్తిడి సైతం ఉందని మరోసారి రుజువైంది. పని ఒత్తిడికి ఎక్కువగా మహిళలే గురవుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని స్విట్జర్లాండ్ కు చెందిన యూనివర్సిటీ హాస్పిటల్ జ్యూరిచ్ శాస్త్రవేత్తలు చేపట్టారు.

 ఈ అధ్యయనం ప్రకారం హార్ట్ స్ట్రోక్ కు దారితీసే సాంప్రదాయేతర హానికారక లైన పని ఒత్తిడి,స్లీప్ డిజార్డర్స్, అలసట వంటివి పురుషులతో పోలిస్తే మహిళల్లో నే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధనా బృందం వెల్లడించింది. జ్యూరిచ్ యూనివర్సిటీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డా.మార్టిన్ హన్సెల్, ఆమె బృందం మహిళల్లో ఎక్కువగా గుండె వ్యాధులకు దారితీసే కారకాలను బయటపెట్టారు. ఫుల్ టైం వర్క్ చేసే వారు ఉద్యోగం చేస్తూనే ఇంటిపనులు చేసే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తమ అధ్యయనంలో తేలినట్టు వెల్లడించారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 2007, 2012,2017 సంవత్సరాలకు సంబంధించిన స్విస్ హెల్త్ సర్వేలోని 22 వేల మంది పురుషులు మహిళల డేటాను పోల్చారు. దీనిద్వారా సాంప్రదాయేతర హాని కారకాల వల్ల మహిళల్లో ఆందోళనకర స్థాయిలో గుండెజబ్బులు వచ్చే ముప్పు పెరిగిందని కనుగొన్నారు. 2007లో ఫుల్ టైమ్ పనిచేసే మహిళల సంఖ్య 38 శాతం ఉండగా 2017 లో 44 శాతానికి పెరిగింది. దాంతో మహిళల్లో గుండెజబ్బుల ప్రమాదం పెరిగింది. పురుషులు మహిళల్లో 2012లో 59 శాతంగా ఉన్న పని ఒత్తిడి 2017 లో 66 శాతానికి పెరిగింది. 2012లో అలసటతో బాధపడుతున్నట్టు 23 శాతం మంది చెప్పగా 2017 లో 29 శాతం మంది అలసటతో బాధపడుతున్నట్లు సర్వేలో తెలిపారు.

అయితే 2017 లో ఒత్తిడికి గురవుతున్న టు చెప్పిన వారిలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఉన్నారు. స్లీప్ డిజర్డర్ సమస్యలు మహిళల్లో 8 శాతానికి పెరగగా పురుషుల్లో 5శాతం పెరిగింది. ఈ సర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమవుతుంది. ఈ పరిశోధనా కాలంలో గుండెపోటుకు దారితీసే  ముప్పు యధావిధిగా ఉందని తేలింది. రక్తపోటు ఉన్న వారిలో 27శాతం మంది,అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో 18 శాతం, మధుమేహం ఉన్న వారిలో 5 శాతం, ఊబకాయంతో బాధపడే వారిలో 11 శాతానికి గుండెపోటు ముప్పు ఉందని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: