"జలుబు - దగ్గు" ఎక్కువ రోజులు తగ్గడం లేదా ?
చాలా మంది ఈ విషయం గురించి ఆందోళన చెందుతున్నారు.. ఈ మహమ్మారి కరోనా జలుబు దగ్గుతోనే కదా మొదలయ్యేది. అయితే మరికొన్ని రోజుల్లో ఎవరికి అయినా ఈ సమస్య ఉంటే బాధపడవలసిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఈ రకమైన జలుబు దగ్గు రావడానికి రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఒకటి .. ఎలర్జీలు మరియు శక్తివంతమైన బ్యాక్తీరియాలు .
వాతావరణంలో త్వరిత గత మార్పుల కారణంగా ఈ ఎలెర్జీలు వస్తున్నట్లు డాక్టర్స్ భావిస్తున్నారు. మాములు జలుబుతో అయితే తుమ్మడం నెమ్మదిగా వస్తుంది. అదే అలర్జీ వలన వచ్చిన జలుబుతో తుమ్ములు విపరీతంగా వస్తాయని నిర్ధారించారు. ఈ ఎలర్జీకి ఎటువంటి మందు లేదు అని వీరు తెలుపుతున్నారు. పైన తెలిపిన విధంగా లక్షణం కనుక ఉన్నట్లయితే ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఇంకో వారం రోజుల్లో వాతాహవరణంలో మార్పులు తొలగి పోయి అంతా సాదారణముగా అవుతుందని అంటున్నారు.