ఆస్థమా సమస్యకి ఈజీగా చెక్ పెట్టాలంటే..?

Purushottham Vinay
ఈ రోజుల్లో బాగా ఎక్కువవుతున్నారు. ఆస్థమా కారణంగా దగ్గు, ఆయాసం ఇంకా అలాగే శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి పలు రకాల సమ్యలు ఎక్కువగా తలెత్తుతాయి.ఆస్థమా బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ధూమపానం ఇంకా అలాగే ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. కొంతమందికి అయితే జన్యుపరంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఆయుర్వేదం ద్వారా  ఆస్థమా సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆస్థమా సమస్యకి ఈజీగా చెక్ పెట్టాలంటే.. మేక మేయని ఆకును ఉపయోగించి మనం చాలా ఈజీగా ఈ ఆస్థమా సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ మొక్క మనకు  అడవుల్లో దొరుకుతుంది.ఆస్థమాకు సంబంధించిన మందుల్లో ఈ మొక్కను  ఉపయోగిస్తారు.

ఆస్థమా వ్యాధి గ్రస్తుల్లో దగ్గు ఇంకా అలాగే తెమడ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మేక మేయని మొక్క ఆకులను తినడం వల్ల వాంతులు అవుతాయి. అయితే వాంతి అవ్వడం వలన పొట్టలో ఉండే ఆహారంతో పాటు ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కూడా కరిగి నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఈ ఆకును మొదటి రోజు అర ఆకు, రెండో రోజూ ఒక ఆకు ఇంకా మూడో రోజు ఒకటిన్నర ఆకు మోతాదులో తీసుకుంటే మంచిది.ఇలా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇంకా అలాగే శ్వాస కోస నాళాల్లో పేరుకుపోయిన కఫం, తెమడ అంతా కూడా పలుచబడి ఈజీగా బయటకు వస్తుంది. దీంతో దగ్గు ఇంకా ఆయాసం తగ్గడంతో పాటు శ్వాస తీసుకోవడం కూడా మీకు తేలిక పడుతుంది. ఈ మేక మేయని ఆకు పొడి ఇంకా రసం మనకు ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ విధంగా మేక మేయని మొక్కను వాడటం వల్ల మనం చాలా ఈజీగా ఆస్థమా సమస్య నుంచి బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: