వెల్లుల్లితో భయంకర రోగాలు మాయం?

Purushottham Vinay
వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జలుబు, దగ్గును చాలా ఈజీగా నివారిస్తుంది. ఇంకా గొంతు కండరాల నొప్పిని తగ్గించి మింగడంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే వెల్లుల్లి తినడం వల్ల జలుబు దాదాపు 60 శాతం వరకు తగ్గుతుందని తేలింది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని సల్ఫర్ ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా కూడా మారుతుంది.ఇంకా అలాగే ఇది రక్త నాళాలను శుభ్రపరుస్తుంది.ఫలితంగా మీ గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.అల్జీమర్స్ ఇంకా డీమెన్షియా వంటి క్షీణించిన వ్యాధులని నివారించడంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా వెల్లుల్లి నీరు చాలా మేలు చేస్తుంది. దీన్ని ప్రతి రోజూ కూడా తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.వెల్లుల్లిలో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంకా హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని ఆహాహంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


గుండె ఆరోగ్యానికి కూడా ఈ వెల్లుల్లి చాలా మంచిది. వెల్లుల్లి బీపీ ని తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇంకా అంతే కాకుండా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని, అదుపులో ఉంటాయని వెల్లడైంది. వీటిలో ఉండే విటమిన్ బి6, విటమిన్ సీ ఇంకా కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ పై ఆధారపడి ఉంటాయి. కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేసి ఇంకా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా మెరుగవుతుంది. అయితే వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది. కాబట్టి దీనిని తినేందుకు ఎవ్వరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపించరు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎవరికి కావాలసినంత పరిమాణంలో వారు  తినవచ్చు. వెల్లుల్లి తినేందుకు ఇష్టపడని వాళ్లు డాక్టర్ల సలహా ప్రకారం సప్లిమెంట్స్‌ను తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: