చేప కూర తింటే ఈ సమస్యలు మాయం?

Purushottham Vinay
చేప కూర తింటే ఈ సమస్యలు మాయం?
సాధారణంగా అందరూ కూడా చికెన్ ఎక్కువగా తింటుంటారు. కానీ ఎప్పుడూ చికెన్ కాకుండా చేపలు తింటే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.చేపలు చాలా రుచికరమైన వంటకం. ఇంకా అంతకంటే చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మనం చేపలను ఏదో ఒక రూపంలో వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.అల్జీమర్స్‌ సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.చేపలను ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు.చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. 


దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.చేపలను తరచూ తింటే వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి.నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాకుండా పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయ వివరాలను ప్రచురించారు.స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలంటే, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రావొద్దంటే తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా చేపలు తినండి. ఎప్పుడూ కూడా ఎలాంటి ఆనారోగ్యాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: