ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది?

Purushottham Vinay

ఇక రోజులో తగినంత నిద్ర పోకపోతే చికాకు, ఒత్తిడి మరింత పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా సులభంగా హాయిగా నిద్రపోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. హాయిగా నిద్రపోయేందుకు.. కొన్ని సార్లు పసుపు, మరికొన్నిసార్లు పిల్లలకు కుంకుమపువ్వు పాలు ఇస్తారు. అయితే ఇంకొంతమంది బెల్లం పాలను కూడా తాగుతారు. వాస్తవానికి, ఈ పద్ధతులన్నీ మంచి నిద్ర కోసం మాత్రమే అవలంబిస్తారు. ఈ రోజు మనం అలాంటి పానీయం గురించి వివరించబోతున్నాం.. ఈ రెసిపీని పాలతో కాకుండా బాదం పాలతో తయారు చేస్తారు. అంటే పడుకునే ముందు బాదం పాలతో చేసిన దేశీ డ్రింక్.. మీ మూడ్‌ని మరింత మెరుగ్గా మార్చి సమయానికి నిద్రపోయేలా చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు..
*ఒక కప్పు బాదం పాలు
*2 చిటికెల దాల్చిన చెక్క పొడి
*1/4 టీస్పూన్ పసుపు పొడి
*కొంచెం అశ్వగంధ పొడి
*రెండు చిటికెల యాలకుల పొడి
*1 స్పూన్ కొబ్బరి నూనె
*1 టీస్పూన్ తేనె
*1 చిటికెడు నల్ల మిరియాల పొడి

పానీయం తయారు చేయు విధానం :
ముందుగా బాదం పాలను తక్కువ మంట మీద వేడి చేయండి.. పాలు బాగా వేడిగా మారినప్పుడు, ఈ పాలలో తేనె తప్ప మిగిలిన అన్నింటిని వేసి కాసేపు మంటపై ఉంచండి.. ఇప్పుడు మంటను ఆపి, పాలు గోరువెచ్చగా మారేలా ఉంచండి. పాలు కొద్దిగా వెచ్చగా మారిన తర్వాత.. జల్లెడ పట్టి తేనెను జోడించాలి. ఆ తర్వాత పాలను తీసుకోవాలి. అనంతరం పళ్ళను తోముకుని నిద్రపోతే మంచిది. ఎందుకంటే.. పళ్లు పసుపు రంగులోకి మారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు దీన్ని నిరంతరం తాగడానికి ప్రయత్నించండి. దీన్ని తీసుకోవడం వల్ల చాలా త్వరగా నిద్ర వస్తుంది.

ఇంకా అలాగే నిద్రపోయే ముందు పాలు-బెల్లం, పసుపు పాలు లేదా కుంకుమపువ్వు అధికంగా ఉండే పాలను తీసుకోండి. దీంతో త్వరగా నిద్రపోవచ్చు.ఇక్కడ పేర్కొన్న పానీయాన్ని సిద్ధం చేసుకొని నిద్రపోయే ముందు తాగాలి. దీంతో హాయిగా నిద్రపోవచ్చు.
వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పడుకునే ముందు చల్లని లేదా వేడి నీటితో స్నానం చేయాలి. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత నిద్ర ఎక్కువగా వస్తుంది.నిద్రపోయే ముందు తల మసాజ్ లేదా ఫుట్ మసాజ్ చేయాలి. ఈ రెండు మసాజ్‌లు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. దీంతో నిద్ర చాలా త్వరగా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: