చేప ముళ్ళు గొంతులో గుచ్చుకుంటే వెంటనే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చేపలు తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ఈజీగా తగ్గుతాయి.గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.అయితే ఈ చేపల్లో ముళ్లు ఉంటాయి. కాబట్టి వీటిని తినేందుకు చాలామంది కూడా భయపడుతుంటారు.చేపలను తింటే ముళ్లు ఎక్కడ గొంతులో గుచ్చుకుంటాయోనని వీటిని చాలా దూరం పెడుతుంటారు. ఇక అంతే కాకుండా చేపలు తినేటప్పుడు కొన్ని సార్లు వాటి ముళ్లు గొంతులో ఇరుక్కుంటాయి.అటువంటి సందర్భాల్లో భయపడకుండా వాటిని చాలా సులభంగా బయటకు తీయవచ్చు. చేపల ముళ్లు గొంతులో ఇరుక్కోకుండా నేరుగా జీర్ణాశయంలోకి వెళితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే జీర్ణాశయంలోని ఆమ్లాలు చేపల ముళ్లను చాలా సులభంగా కరిగించేస్తాయి. చేపల ముళ్లు కనుక గొంతులో ఇరుక్కుంటే పొట్టమీద గట్టిగా ఒత్తాలి. ఇంకా వీపుపై ఒత్తిడి కలిగించాలి. అయితే ఈ సమయంలో నోటిని తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముల్లు చాలా ఈజీగా బయటకు వస్తుంది.ఇంకా పొడి అన్నాన్ని ముద్దలా చేసి నమలకుండా మింగేయాలి. తరువాత ఒక గ్లాస్‌ మంచినీళ్లు తాగాలి.


దీంతో ముల్లు గొంతు నుంచి లోపలికి ఈజీగా జారిపోతుంది. లేదా అరటిపండును సగం తీసుకుని నోట్లో వేసుకుని నమలకుండానే మింగేయాలి. ఇలా చేసినా కూడా మంచి ఫలితమే ఉంటుంది.చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే బ్రెడ్‌ను తినాలి. అయితే బ్రెడ్ కు రెండు వైపులా పీనట్‌ బటర్‌ రాసి తినేయాలి. తర్వాత వెంటనే నీళ్లు తాగాలి. ఒక గ్లాస్‌ నీటిలో రెండు టీస్పూన్ల వెనిగర్‌ ని కలిపి ఆ నీటిని రెండు టీస్పూన్ల మోతాదులో తాగాలి. చేప ముల్లు ఇరుక్కుపోయిన వెంటనే సోడాను తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే సోడాలో ఉండే గ్యాస్ గొంతులోని ముల్లుపై ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ముల్లు ఈజీగా బయటకు వస్తుంది. ఇక చేప ముల్లు గొంతులో ఇరుక్కోగానే వెంట వెంటనే 4, 5 సార్లు దగ్గాలి. దీంతో ముల్లు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అందుకే చేపలను తినేటప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా ఇంకా కంగారు పడకుండా తినాలి. ఎంత ప్రయత్నించినా కూడా ముల్లు బయటకు రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: