అర్ధాకలితో మగ్గుతున్న బాల్యం.. ప్రభుత్వ బాధ్యత ఏది..?
పోషకాహార లోపం డబ్ల్యూహెచ్వో నిర్వచనం కొన్ని గణాంకాలు:-
కనీసమైన జీవన చర్యలు జరిగే ఆస్కారం లేకుండా శారీరక వ్యవస్థ చితికి పోయి ఉన్నప్పుడు అనారోగ్య లక్షణాలు చాలా కనబడుతూ ఉంటాయి. అప్పుడే మనం ఆరోగ్యం చెడిపోయింది అని అంటూ ఉంటాం." ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, ముఖము పొట్ట తదితర భాగాలు వాపుతో ఉండటం ,కాళ్లు చేతులు సన్నబడటం వంటి లక్షణాలు ముఖము శరీరమంతా పేలి పోయినట్టుగా కనపడిన అటువంటి స్థితి ఆధారంగా తీవ్ర, మధ్యస్థ పౌష్టికాహార లోపాలను నిర్దేశిస్తారు. నిర్వచిస్తారు.."
దేశవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసిన సర్వే వివరాల ఆధారంగా ప్రభుత్వము పోషకాహార లోపంతో బాధపడుతున్న టువంటి చిన్నారుల గణాంకాలను విడుదల చేసింది. 2021 అక్టోబర్ 14వ తేదీ నాటికి భారతదేశంలో ఉన్న స్థితిగతులను ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపంతో,15.46 లక్షల మంది మధ్యస్థ పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్లు గా అంచనా వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గా దేశం లో ఉన్నటువంటి చిన్నారుల సంఖ్య 46 కోట్లు ఉండగా ప్రస్తుతము 50 కోట్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతము దేశంలో 33 లక్షల మంది పోషకాహారలోపంతో అనేక రకాల బాధపడుతుండగా అందులో సగం మందిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని గణాంకాలు ప్రభుత్వాలను, సమాజాన్ని హెచ్చరిస్తున్నవి.