స్థిరంగా పసిడి ధరలు.. పరుగులు పెడుతున్న వెండి ..!
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.49,750 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.45,600 వద్ద నిలకడగా ఉంది.బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,000కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు, ఆభరణాలు వంటివి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.
వెండిని ఎక్కువగా పరిశ్రమ రంగంలో వినియోగిస్తారు. అలాగే ఆభరణాల తయారీ కోసం కూడా వాడతారు. అందువల్ల వెండికి డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్ లో మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 0.36 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1877 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్కు 0.54 శాతం తగ్గుదలతో 27.75 డాలర్లకు దిగొచ్చింది.కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి మార్కెట్ లో వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..