బ్యాడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు..వెండి ఇలా..!

Satvika
మహిళలకు ఈరోజు చేధు వార్త..బంగారం ధరలకు నేడు మార్కెట్ లో రెక్కలు వచ్చాయి.. నిన్న మార్కెట్ లో కాస్త ఊరటను కలిగించిన ధరలు ప్రస్తుతం భారీగా పెరిగాయి.పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200గా ఉంది.కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 68,500 గా నమోదు అయింది..అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఈరోజు కాస్త కిందకు దిగి వచ్చాయి.. మొత్తానికి పసిడి ధరలు ఈరోజు మార్కెట్ లో షాక్ ఇస్తున్నాయి. బంగారం కొనుగొల్లు పై కాస్త తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..

 
ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900, 24 క్యారెట్ల ధర రూ.52,250 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200గా ఉంది.


బంగారం ధరలు పెరిగితే..వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈరోజు కిలో వెండి పై 1000 రూపాయలు పెరగగా..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.62,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.68,500 ఉంది. బెంగళూరులో రూ.68,500, కేరళలో రూ.68,500 లుగా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలను గమనిస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,500, విజయవాడలో రూ.68,500 ఉంది. మార్కెట్ ఈరోజు పసిడి, వెండి పెరిగాయి.మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: