పరుగులు పెడుతున్న పసిడి..అదే దారిలో వెండి..!

Satvika
మొన్నటివరకు కాస్త ఊరట కలిగించిన పసిడి ధరలు..ఇప్పుడు షాక్ ఇస్తున్నాయి.రోజు రోజుకు బంగారం ధరలలో మార్పులు జరుగుతునే ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే , నేడు మార్కెట్ పెరిగింది.మార్కెట్లో కొన్ని రోజుల నుంచి తగ్గిన వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.బంగారం దారిలోనే వెండి ధరలు కూడా నడిచాయి.ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. బంగారం 22 క్యారెట్లపై రూ.150, 24 క్యారెట్లపై 160 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.400 మేర పెరిగి.. రూ.62,000 లుగా ఉంది.

 
నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము...ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370, 24 క్యారెట్ల ధర రూ.52,770 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250గా నమోదు అవుతుంది.

 
ఇక తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,250 గా ఉంది.. ఇక విశాఖలో కూడా అదే విధంగా ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు పెరిగితే..వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.చెన్నైలోలో కిలో వెండి ధర రూ.66,500 ఉంది. బెంగళూరులో రూ.66,500, కేరళలో రూ.66,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,500 గా ఉంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: