బాబాయ్ - అబ్బాయ్‌తో మహేష్..!

Podili Ravindranath
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరు అంటే... ఠక్కున వచ్చే సమాధానం ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలో అడుగు పెట్టిన మహేష్... ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. హై బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు కూడా. మహేష్‌తో  సినిమా అంటే... అది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని నిర్మాతల నమ్మకం. లేట్‌గా వచ్చినా సరే... లేటెస్ట్‌గా వస్తుందనే టాక్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం మహేష్ ఇమేజ్ ఇటు తెలుగు ఇండస్ట్రీలో కాకుండా... అటు కోలీవుడ్, ఇటు శాండిల్ వుడ్‌తో పాటు... బాలీవుడ్‌లో కూడా మహేష్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వరుస హిట్‌లతో పరిశ్రమలో తానేమిటో ఇప్పటికే రుజువు చేసుకున్నారు ప్రిన్స్. ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డులు అన్నీ కూడా మహేష్ సినిమాల పేరుతోనే ఉన్నాయి. ఇక కలెక్షన్ల పరంగా అయితే.... మహేష్ సినిమాకు తిరుగే లేదు.
ఇప్పుడు తాజాగా సర్కార్ వారి పాట పేరుతో మహేష్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ముందుగా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని యూనిట్ అనుకున్నప్పటికీ... ఇది కాస్తా సమ్మర్‌కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. దీంతో కాస్త రిలాక్స్‌గా ఉన్నారు మహేష్. సాధారణంగా ఫంక్షన్లకు దూరంగా ఉంటారు మహేష్. ఏదో తప్పని సరి అయితే తప్ప.. వేడుకలకు హాజరవ్వరూ. ఇక రియాల్టీ షోలు, ఇంటర్వ్యూలు అయితే మాత్రం ఆమడ దూరంలో ఉంటారు మహేష్. సినిమా ప్రమోషన్లకు మాత్రం వెళ్తారు. అయితే ఇప్పుడు మాత్రం మహేష్ రెండు టీవీ షోలలో పాల్గొని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ రెండు కూడా నందమూరి కుటుంబంతోనే కావడం విశేషం. ఓ వారం క్రితం తారక్‌తో కలిసి ఎవరు మీలో కోటిశ్వరుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియలో హోరెత్తుతున్నాయి. అది టెలికాస్ట్ కాక ముందే... ఇప్పుడు మరో షోలో మహేష్ పాల్గొన్నారు. ఇది ఆహా ఓటీటీలో వచ్చే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే. నందమూరి బాలకృష్ణతో చేస్తున్న ఈ రియాలిటీ షో‌లో మహేష్ కనిపించనున్నారు. ఇప్పటికే  ఈ ప్రొగ్రాం ఏపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: