టిఎస్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు.. వివరాలు..

Purushottham Vinay
ఇక తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయడం జరిగింది.గతంలో విడుదల చేసిన కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ అనేది వాయిదా పడటం జరిగింది. ఎంసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నెల 11 వ తేదీ నుంచి 16 వ తేదీ దాకా వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈనెల 18న ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపులు జరగబోతున్నాయి.ఇక ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే ఈ నెల 4 వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలై 13 వ తేదీతో ముగియాల్సి ఉంది.అలాగే మరోవైపు, ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ అనేది యథాతథంగా జరగనుంది. ఇక ఈ నెల 4 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు కూడా ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. కాలేజీల గుర్తింపు ప్రక్రియ జాప్యంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపడం జరిగింది.

ఇక ఈ ఏడాది విడుదల చేసిన ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో మొత్తం 82 శాతం మంది ఇంకా అగ్రికల్చర్‌లో మొత్తం 92 శాతం మంది క్వాలిఫై అవ్వడం జరిగింది.అలాగే ఇంజనీరింగ్‌ పరీక్షకు మొత్తం లక్షా 47 వేల 991 మంది హాజరైతే లక్షా 21 వేల 480 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అగ్రికల్చర్‌ విభాగంలో లో మొత్తం 79 వేల 900 మంది పరీక్ష రాస్తే 73 వేల 70 మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడం జరిగింది.ఇక తెలంగాణలోని జూనియర్‌ కాలేజీలు ఇంకా రెండేళ్ల ఇంటర్మీడియెట్‌ కోర్సును అందించే కాంపొజిట్‌ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును పొడిగించడం జరిగింది. సెప్టెంబర్‌ 15వ తేదీ వరకూ కూడా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్‌ బోర్డు తాజాగా ప్రకటించడం జరిగింది. అన్నీ ప్రభుత్వ ఇంకా ప్రైవేటు కళాశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: