ఏపీపీఎస్సీ.. తీరు మారాల్సిందే..?
తాజాగా 2018 గ్రూప్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలోని ఎపీపీఎస్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో పొందు పరిచారు. దీని పూర్వాపరాలు చూస్తే.. 167 గ్రూప్1పోస్టుల భర్తీకి 2018 లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్నుంచి నాలుగేళ్ల పాటు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కరోనా వల్ల మూల్యాంకనం ఆలస్యమైంది.
ఆ తర్వాత డిజిటల్ వాల్యువేషన్ పై అభ్యంతరాలు తెలపుతూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విషయం కోర్టుకు వెళ్లింది. కోర్టు తీర్పుతో తిరిగి మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాల్సి వచ్చింది. ఇలా అనేక కారణాలతో నియామక ప్రక్రియ చాలా ఆలస్యమైంది. ఇక ఈ గ్రూప్ 1 ఫలితాలు చూస్తే.. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు ఉన్నారు.
విజేతల్లో 96 మంది పురుష అభ్యర్థులు ఉన్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ కారణాలతో 4 పోస్టులను భర్తీ చేయలేదని ఏపీపీఎస్సీ ప్రకటించింది. అలాగే డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఎంపికైన వారిలో టాప్ లో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో టాప్ 1 లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత నిలిచారు. టాప్ 2 లో నిలిచిన వైఎస్ ఆర్ జిల్లా కొతులగుట్టపల్లి కి చెందిన కె.శ్రీనివాసరాజు నిలిచారు. టాప్3లో హైదరాబాద్ కు చెందిన సంజన సింహ నిలిచారు. ఇకనైనా నియమకాల పక్రియ ఏళ్ల తరబడి జరగకుండా ఏపీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకోవాలి.