తెలంగాణలో వర్షాలు.. అలర్ట్‌గా ఉండకపోతే అంతే?

తెలంగాణలో వర్షాలు ప్రారంభం అయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణలో మొదలైంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు మరియు రాబోవు మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం అయ్యింది. తెలంగాణలోని జోనల్, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్  జి.  రఘుమా రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పై సమీక్ష నిర్వహించారు.

ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ నగరం లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ జి రఘుమా రెడ్డి అధికారులను ఆదేశించారు. జనం కూడా చెట్లపై, రోడ్లపై మరియు గృహాలపై విద్యుత్ తీగలు తెగి పడ్డట్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలని.. వెంటనే విద్యుత్ శాఖ దృష్టి కి తీసుకురావాలని సీఎండీ  జి రఘుమా రెడ్డి సూచించారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి వెళ్లకూడదని.. అలాంటి విషయాలపై తమకు సమాచారం ఇవ్వాలని సీఎండీ  జి రఘుమా రెడ్డి తెలిపారు.

విద్యుత్‌ సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం సీఎండీ జి రఘుమా రెడ్డి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ ను సంప్రదించవచ్చని సీఎండీ జి రఘుమా రెడ్డి సూచించారు. ఈ నెంబర్లతో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని  సీఎండీ జి రఘుమా రెడ్డి తెలిపారు. వీటితో పాటు సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విద్యుత్ సమస్యలు సంస్థ దృష్టికి తీసుకురావాలని సీఎండీ రఘుమా రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: