నారా లోకేశ్ రంకెలు.. మరీ ఇంత ఆలస్యమా గురూ..?
అలా కొన్నిరోజుల పాటు నారా భువనేశ్వరి ఇష్యూ ద్వారా టీడీపీ నేతలు వైసీపీ తీరుపై విమర్శలు చేసేవారు. క్రమంగా ఆ విషయం సైడ్ అవుతున్న సమయంలో ఇప్పుడు నారా లోకేశ్ మరోసారి ఈ ఇష్యూపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా తల్లిని అంటే నేను ఊరుకుంటానా.. అంటూ నారా లోకేశ్ రంకెలు వేశారు. మేం ఏమైనా జగన్ కూతుళ్లను ఏమైనా అన్నామా అని కూడా నారా లోకేశ్ అన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే.. నారా లోకేశ్ ఆ మాత్రం ఆవేశపడటంలో అర్థం ఉంది.. ఆవేశ పడే హక్కు కూడా ఆయనకు ఉంది. దీంట్లో ఎలాంటి వివాదం లేదు.
తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా అలాగే స్పందిస్తారు.. అయితే.. ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. అసలు వల్లభనేని వంశీ ఈ వ్యాఖ్యలు చేసి చాలా కాలమైంది. దీనిపై ఏపీ అసెంబ్లీలో రాద్ధాంతం జరిగి కూడా చాలా రోజులైంది.. భువనేశ్వరి ఇష్యూలో టీడీపీ నేతలు చాలామంది స్పందించేశారు. అయితే.. అంతా ఆ ఇష్యూను మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు నారా లోకేశ్.. నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటానా అంటూ రంకెలు వేయడం కాస్త విడ్డూరంగానే ఉంది.
అసలు నారా లోకేశ్.. వల్లభనేని వంశీ అలాంటి మాటలు అన్నప్పుడే స్పందించాల్సింది. పోనీ.. అసెంబ్లీలో వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు రోదించినప్పుడైనా మాట్లాడి ఉండాల్సింది.. కానీ.. మరీ ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నాయి.