కోవిడ్ అలర్ట్ : ఎగుమతులు సరే.. స్థానికంగా భయాలు తోలగేది ఎప్పుడు ?
గతంలో అంటే రెండోవేవ్ ప్రారంభంలో భారత దేశం కోవిడ్ ను నియంత్రించే వ్యాక్సిన్ కు ఎగుమతులు నిలిపి వేసింది. దేశం రికార్డు స్థాయి ( బిలియన్ డోసుల మార్కు) టీకాలను వేసిన తరువాతనే ఎగుమతులకు సంబంధించిన పరిమితులలో సడలింపు ఇచ్చింది, ప్రస్తుతం ఇంకా కూడా ఎక్కువ మందికి రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తి కాక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పనిని పూర్తి చేయాలని తలుస్తోంది.
దేశంలోని రెగ్యులేటరీ జాబితా చాలా పెద్దది గానే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు భారత్ లో తయారవుతున్న కరోనా టీకాలు చాలా నే ఉన్నాయి. కోవాక్సిన్, కార్బివ్యాక్స్, జై కోవ్ డి, తదితర టీకాలు భారత్ లో తయారవుతున్నాయి. ప్రస్తుతం భారత దేశం ఎగుమతులకు అనుమతులు ఇవ్వడంతో ఆయా కంపెనీలు ప్రస్తుతం తమ ఉత్పత్తులను దేశీయంగా సరఫరాను తగ్గించి, ఎగుమతులపై దృష్టి సారించాయి. దీంతో భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్నది కోవిడ్ టీకాలే అని వాణిజ్య శాఖ కూడా పేర్కోంది. ఆఫ్రికా దేశాలు చాలా పెద్ద సంఖ్యలో బారత్ లో తయారైన టీకాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఒక్క కోవాక్స్ టీకానే నెలకు 30 మిలియన్ డోసులను ఎగుమతి చేస్తోంది అంటే భారత్ ఎగుమతి చేస్తున్న టీకాలను ఎంత మేరకు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి దేశంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇండియా ( డిసిజిఎల్), ప్రపంచ ఆరోగ్య సంస్ష ( డబ్ల్యూ హెచ్ ఓ) తో పాటు అమెరికా కూడా కోవాక్సిన్ కు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే ఈ టీకాను వినియోగించాలని సూచించాయి.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ లను ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలను చైనా దే అగ్ర స్థానం కావడం విశేషం. మార్కెట్ లూ చైనా ముందు నుంచి దూకుడు గానే వ్యవహరిస్తోంది, అయితే భారత్ లోని తయారీ దారులు తమకు అనుమతులు మంజూరు చేస్తే భారత దేశం సరిహద్దు దేశం చైనా కన్నా ముందజలో ఉంటామని పేర్కోంటున్నారు. అభివృద్ధి చెందన దేశాలు కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకుని మూడో బూస్టర్ డోసును వేసుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఉంటుందనే వార్తలు వెల్లువలా వస్తుండటం, భారత్ లో తయారవుతున్న టీకాలు ఎగుమతి అవుతుండటంతో ప్రమాదం ముంచుకు వస్తే ఎలా తట్టుకోవాలని పలువురు ఆందోళన చెందుతున్నారు.