మా పోరు : నాన్నే గెలిచాడు!
చిత్తూరులో ఓ చిన్న ఊరు.. దాని దాటి వచ్చిన ఓ కుర్రాడు.. ఆయన కూడా వేషాల కోసం వేళాపాళాలేకుండా తిరిగాడు. తల్లీ తండ్రీ వద్దన్నా కొన్ని పనులు చేసి, నటుడిగా స్థిరపడ్డాడు. దాసరి శిష్యుడు మోహన్ బాబు. ఈవిధంగా మీరు ఆయన దగ్గర పలకండి. పొంగిపోతాడు. ఇండస్ట్రీలో ఉన్నంత మంచి, ఉన్నంత చెడు అన్నీ అందరిలోనూ ఉంటాయి. మంచి చెడులలో ఏ గుణం ఒకింత ఎక్కువగా ఎవ్వరిలో ఉంటే వారు వార్తల్లో నిలుస్తారు. మోహన్ బాబు వార్తల్లో నిలిచాడు. కొడుకు ను మా అధ్యక్షుడ్ని చేయాలన్న ఆశలో భాగంగా బరిలో దిగాడు. ఆయనను విజేతను చేయాలన్న తంలపుతో ఆఖరు దాకా పోరాడాడు. తన పరిచయాలు అన్నింటిని వినియోగించుకున్నాడు.
ఇండస్ట్రీని వదిలిపోయిన హీరోయిన్లను రప్పించాడు. మాలాశ్రీ ఎవరికి గుర్తు. జెనీలియా వస్తుందని అనుకున్నారా. పోనీ! జయప్రద. ఇవేవీ జరిగే పనులు కావు. రికార్డు స్థాయి పోలింగుకు ఇవన్నీ సహకారం అందించాయి. పోలింగ్ అయిపోయాక కూడా రిలాక్స్ కాలేదు. కౌంటింగ్ సాఫీగా సాగేందుకు తనవంతు ప్రయత్నమేదో సీనియర్ నటులు మురళీ మోహన్ తో కలిసి చేశారు. మోహన్ బాబు గతంలో కొన్ని తప్పులు చేశారు. కానీ కొడుకు గెలిచే వరకూ పెద్దగా నోటికి పని చెప్పలేదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. రెండు టెలివిజన్ షోలకు వెళ్లారు. అలీలోనూ, ఆంధ్రజ్యోతి ఆర్కేతోనూ ఎంతో పద్ధతిగా మాట్లాడి వచ్చారు. ఇవి తప్ప ఆయన పెద్దగా ఎక్కడా రియాక్ట్ కాలేదు. సహజ సిద్ధం అయిన ఆవేశంలో భాగంగా ఆయన కొందరు సభ్యులపై అరిచారు. మరి! ప్రకాశ్ రాజ్ అంత ఘోరంగా ఎవ్వరిపైనా కామెంట్లు విసరలేదు. నోరు పారేసుకోవడం అన్నది ప్రకాశ్ రాజ్ లాంటి వారే చేస్తే, మోహన్ బాబు లాంటి సీరియస్ మనుషులు, సీనియర్ నటులు చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు పెదరాయుడు పరిశ్రమకు దొరికాడు. ఆ రాయుడి రూలింగ్ ఎలా ఉంటుందో మరి!