పట్టించుకోడు జగన్ ! : కాగ్ గోల కాకి గోల !
భ్రమలు వీడాక వాస్తవాలు అన్నవి తేటతెల్లం అవుతాయి. ఆదాయం అంతా అప్పులకూ, వడ్డీలకూ, పింఛన్లకూ, వేతనాలకూ, పథకాలకూ, వాటి అమలుకూ కేటాయిస్తే దానిని మొత్తం కలిపి రెవెన్యూ ఖర్చు అనే అంటారని, అభివృద్ధి అని వ్యవహరించరు అని ఆర్థిక నిపుణులు చెప్పిన విధంగా ప్రముఖ మీడియా ఉటంకించింది ఇవాళ. కనుక సంపద కాపాడుకునే దృష్టి కానీ సంపద పెంపొందించేందుకు చేయాల్సిన సృష్టి కానీ సంబంధిత దృక్పథం కానీ మన పాలక వర్గంలో లేవు అని తేలిపోయింది.. అని జగన్ ను ఉద్దేశించి టీడీపీ చెబుతున్న మాట. అయినప్పటికీ కొన్ని లెక్కలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆర్థిక శాఖలో ఎన్నో ఆంక్షలు ఉన్నా కూడా కాగ్ లెక్కలు మాత్రం గతం కన్నా ఇప్పుడు ఆదాయం మెరుగుదలలో లేదు అని చెప్పినా జగన్ ఒప్పుకోరు. అదంతా అబద్ధం అని తేల్చి కాగ్ గోల - కాకి గోల అని తేల్చేస్తారు.
ఎవ్వరు ఏమనుకున్నా ఎలా ఉన్నా ఏమయిపోయినా సంక్షేమ పథకాలు ఆగవు. అది తేలిపోయింది. ఇంకేం ఆదాయం ఎలా ఉ న్నా అప్పుల పుట్ట అలానే ఉన్నా మనం ప్రభుత్వం నుంచి ఆశించాల్సినవి తగ్గించుకోం అని కూడా తేలిపోయింది.ఇంకేం చేయాలి? ఇంకేం చేయగలం చెప్పండి ? ప్రభుత్వం ఎంత మేరకు సంపాదించింది అన్నది మనకు అనవసరం మన డబ్బు మనకు అందిందా లేదా అన్నది ముఖ్యం. అప్పుడు అభివృద్ధి అన్న మాటను ఎలా వినిపించగలం? కనుకనే మనకు కాగ్ గోల కాకి గోల అని.. ఆర్థిక శాస్త్రం మనకు చిక్కదు. అంతు పోలదు కాదు అంతు పట్టదు ఇప్పటికీ మరియూ ఎప్పటికీ! జగన్ మాత్రం తనదైన పంథాలో వెళ్తున్నారు. అప్పుల ఊసు బయటకు చెప్పవద్దని అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బయట నుంచి తీసుకువచ్చే అప్పులు, భూముల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధికే కేటాయిస్తున్నారు అన్న భ్రమ నుం చి ఎవరికి వారు బయటకు వస్తే అప్పుడు ఏది నిజమో అన్నది ఏది అబద్ధమో అన్నది తేలిపోతుందని టీడీపీ చెబుతోంది.