కూలిన శిథిలాలపై రాజకీయ పునాదులు!
2016 పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు కరకట్టపై ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి కంకిపాడు వరకు ఉన్న 42 ఆలయాలను కూల్చారు. ఆధునీకరణకు అడ్డుగా ఉన్నాయని హిందూ దేవాలయాలను అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా కూల్చిశారని హిందూ ధార్మిక సంఘాలు అప్పట్లో దుమ్మెత్తిపోశాయి. ఆ ఆందోళన సెగలు ఎలా కాలగర్భంలో ఎలా కలిశాయో .. ఆస్థాయిలోనే తదననంతరం మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంచనాలకు మించిన సీట్లతో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యారు. నవరత్నాలు, సంక్షేమ పథకాలను క్యాలెండర్ వైజ్ గా పెట్టి అమలు చేస్తూ తనదైన మడమ తిప్పని మార్కును నిరూపించుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పట్టుదలతో పాలన సాగిస్తూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో తాడేపల్లి కరకట్టపై ఇళ్లు కూల్చివేత ఇష్యూ రాజకీయంగా ఊపందుకుంది.
తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్ నివాసం వెనకాల ఉన్న అమరారెడ్డి కాలనీలో ఎన్నో ఏళ్లుగా 321 కుటుంబాలు నివాసముంటున్నాయి. ముఖ్యమంత్రి భద్రత కారణాల దృష్ట్యా కాలనీలోని ఇళ్లును తొలగించి, వారికి వేరే చోట ఇళ్లు మంజురు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమరారెడ్డి కాలనీ వాసులకు ఆత్మకూరులో నివేశ స్థలాలను కేటాయించి, ఇళ్లు మంజురు చేశారు అధికారులు. 277 మంది కుటుంబాలు అక్కడికి వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మిగతావారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో సరైన న్యాయం జరగలేదని, నిరాశ్రయులకు అదనపు పరిహారం ఇవ్వాలని శివశ్రీ తోపాటు మరి కొందరు కాలనీవాసులు కేటాయింపులను వ్యతిరేకించారు. కాలనీలో ఇంకా అనేక కుటుంబాలు నివాసముంటున్నారని, నష్టపరిహారం ఇచ్చేవరకు ఖాళీ చేసేది లేదని కాలనీవాసులు కొందరు శివశ్రీతో పాటు నిరసనకు దిగారు. ఇది ఇలా ఉంటే గత రెండు రోజుల నుంచి ఖాళీ చేసిన ఇళ్లును కూల్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.