ఉద్యోగులకు జగన్ గుడ్‌న్యూస్ చెప్పేశారా?

రాష్ర్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి ఇవ్వాల్సిన డీఎ ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారా.. ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారా.. అవునంటున్నారు  ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేసారట. వరుసగా 3 రోజులు  సంక్రాంతి సెలవులు రావడం వల్ల సర్క్యులర్ ఇవ్వడంలో జాప్యం జరిగినట్లు సీఎంవో అధికారులు చెప్పినట్లు ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల తాను సీఎంను కలసినప్పుడు సంక్రాంతి పండుగకు డీఎ ఇస్తామని  చెప్పిన హామీని గుర్తు చేయగా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై కొన్ని  ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేయడాన్ని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ తప్పు పట్టారు. ఉద్యోగ సంఘాలు నిబంధనలను పాటించాలని అలా చేయకపోతే గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ అన్నారు. ఏపీఎన్జీవోలు ముఖ్యమంత్రిమెప్పు కోసం  పనిచేస్తున్నామని  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఆరోపణలపైనా ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ మండిపడ్డారు.

తాము ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో పీఆర్సీ తెచ్చుకోలేదని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ అంటున్నారు. ఉద్యోగుల తరపున పోరాటం చేసి సాధించామన్న విషయం తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం  సమస్యలపై పోరాటం చేయలేకే గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశారని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ అన్నారు. సూర్యనారాయణ వెనుక  ఏ శక్తి ఉండి పనిచేయిస్తుందో ఉద్యోగులు అంతా గమనిస్తున్నారని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు ఏంచేసినా , ఎన్ని చేసినా తాము  మౌనంగా ఉన్నామని, ఇలాగే కొనసాగితే సహించేది లేదని ఖబడ్డార్ అంటూ ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల  సంఘానికి గుర్తింపును సూర్యనారాయణ దొంగచాటున  తెచ్చుకున్నారన్న ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్... డిపార్టు మెంట్ లో సూర్యనారాయణ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: